స్పెయిన్అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటీ
- May 31, 2017
నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేడు స్పెయిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు మారియానో రజోయ్తో భేటీ అయ్యారు. ఉగ్రవాద అణచివేత అజెండాగా ప్రధాని మోదీ.. రజోయ్తో చర్చలు జరిపారు. భారత్, స్పెయిన్పై ఉగ్రవాద ప్రభావం ఉందని, దానిపై పోరాడేందుకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ కోరారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రజోయ్ నాయకత్వంలో స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. అంతేగాక, భారత్కు స్పెయిన్ అధిక ప్రాధాన్య దేశమన్నారు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అర్థం వస్తుందని మోదీ పేర్కొన్నారు. 1988 తర్వాత స్పెయిన్లో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. పర్యటనలో భాగంగా.. స్పెయిన్ రాజు ఆరో ఫిలిప్ను కలవనున్నారు. బిజినెస్ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ మోదీ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







