స్పెయిన్అధ్యక్షుడితో నరేంద్ర మోదీ భేటీ
- May 31, 2017
నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేడు స్పెయిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు మారియానో రజోయ్తో భేటీ అయ్యారు. ఉగ్రవాద అణచివేత అజెండాగా ప్రధాని మోదీ.. రజోయ్తో చర్చలు జరిపారు. భారత్, స్పెయిన్పై ఉగ్రవాద ప్రభావం ఉందని, దానిపై పోరాడేందుకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ కోరారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రజోయ్ నాయకత్వంలో స్పెయిన్ ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. అంతేగాక, భారత్కు స్పెయిన్ అధిక ప్రాధాన్య దేశమన్నారు. ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక బంధానికి కొత్త అర్థం వస్తుందని మోదీ పేర్కొన్నారు. 1988 తర్వాత స్పెయిన్లో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. పర్యటనలో భాగంగా.. స్పెయిన్ రాజు ఆరో ఫిలిప్ను కలవనున్నారు. బిజినెస్ ప్రముఖులతో రౌండ్ టేబుల్ సమావేశంలోనూ మోదీ పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









