ప్రైవేట్ పరం కానున్నప్రభుత్వరంగ ఏకైక స్వదేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా
- May 31, 2017
ప్రభుత్వరంగ ఏకైక స్వదేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను ప్రయివేటు పరం చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. కుంభకోణాల ఊబిలో చిక్కుకున్న ఎయిరిండియాను నష్టాలు వస్తున్నాయనే కారణంతో విక్రయించడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రుణ భారంతో ఉన్న ఎయిర్ లైన్స్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు దేశంలోని టాప్ థింక్-ట్యాంక్ నితి ఆయోగ్ సిఫార్సు చేసింది. ముఖ్యంగా బ్రిటిష్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్ లైన్స్, ఆస్ట్రియన్ ఎయిర్ లో ఆయా ప్రభుత్వాలు మొత్తం వాటాలను విక్రయించినట్టు సూచించారు. అయితే దీనిపై స్పందించిన కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు నీతి ఆయోగ్ సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణపై హింట్ ఇచ్చిన నేపథ్యంలో నీతి ఆయోగ్ సిఫార్సులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత వారంలో ఆర్థిక మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎయిర్ ఇండియా ఆర్థిక పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ ఇండియా 14 శాతం మార్కెట్ వాటాతో ,రూ 50 వేల కోట్లు అప్పుల్లో ఉన్నట్టు వ్యాఖ్యానించారు. మరోవైపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎయిర్ ఇండియా , ఇండియన్ ఎయిర్లైన్స్పై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఒప్పందం ద్వారా రూ. 70,000 కోట్ల విలువైన 111 బోయెంగ్ విమానాలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ద్వారా మరింత అప్పుల ఊబిలోకి కూరకుపోయిందని సీబీఐ ఆరోపించింది. దీనికి సంబంధించి విమానయాన శాఖ, ఎయిర్ ఇండియాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులపై కేసలు నమోదు చేసింది. సిబిఐ విచారణకు సహకరిస్తామని పౌర విమాన యాన శాఖమంత్రి అశోక్
గజపతి ప్రకటించారు. కాగా ఎయిర్ ఇండియా మొత్తం అప్పులు రూ. 60వేల కోట్లు. అందులో రూ. 21,000 కోట్ల విమానాల సంబంధిత రుణాలు, రూ .8 వేల కోట్ల మూలధన పెట్టుబడి ఉన్నాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







