భారత్లోకి ప్రవేశించిన ప్రమాదకర వైరస్ జికా
- May 31, 2017
ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్లోకి ప్రవేశించింది. గుజరాత్లోని అహ్మదా బాద్ సిటీలోని బాపూనగర్ ప్రాంతంలో ముగ్గురికి జికా వైరస్ సోకిన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) శనివారం నిర్ధారించింది. వైరస్ బారినపడిన వారిలో గర్భిణి, 64 ఏళ్ల వృద్ధుడు, బాలింత ఉన్నారు. వీరంతా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం.
సాధారణ నిర్ధారణ పరీక్షలో భాగంగా అహ్మదాబాద్లోని బీజే వైద్యకళాశాల ఆధ్వర్యంలో 93 రక్తనమూనాలపై ఆర్టీ–పీసీఆర్ టెస్ట్ జరపగా వైరస్ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్గా తేలిన శాంపిళ్లపై మళ్లీ నిర్ధారణ కోసం పుణెలోని ల్యాబ్లో టెస్టులు చేశారు.
నిర్ధారణ పరీక్షల వివరాలను డబ్ల్యూహెచ్వోకు పంపించామని, వైరస్ జాడను నిర్ధా రిస్తూ అక్కడి నుంచి సమాచారం వచ్చిందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో భారత్లోకి జికా వైరస్ ప్రవేశించినట్టు వైద్యులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









