650 మంది ప్రభుత్వ పాఠశాల సిబ్బంది తొలగింపు
- May 31, 2017
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి 650 మంది ఉద్యోగులను వారి వారి విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యా మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారిక సమాచారం ద్వారా వెల్లడైంది. స్థానిక అరబిక్ రోజువారీ అర్రేయా అధికారికంగా, కార్య నిర్వహణాభివృద్ధి , కార్మిక మరియు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని పరిపాలనా ఉద్యోగాలను నియామకం జరపడానికి ఇంటర్వ్యూ నిర్వహించింది. అందులో ఎంపికైన ఖతరీ అభ్యర్థుల జాబితాలను విద్య మంత్రిత్వశాఖ అందించిందని పేర్కొంది. తొలగించబడిన ఉద్యోగాలలో అధికభాగం ఉద్యోగాలు పరిపాలనా స్వభావం కలిగినవేనని ఓ సమాచారం. అయితే అకడమిక్ ఉద్యోగాలు ఉద్యోగుల సంఖ్యలో సరి పోల్చితే కేవలం 15 శాతం మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, తొలగించబడిన 100 మంది ప్రవాసీయులైన ఉద్యోగులు తమ పదవీకాలం ముగిసి పదవీ విరమణ వయస్సుకు చేరారు. అలాగే, మిగిలిన రద్దు చేయబడిన కొంతమంది ఉద్యోగులలో వారు తాత్కాలికంగా మాత్రమే నియమించబడ్డారు. ఖతార్ వాసులు ద్వారా భర్తీ కాబడిన పలు ఉద్యోగాల ప్రధానంగా ఏవంటే సామాజిక కార్యకర్తలు, బాలికల పాఠశాల బస్సు పర్యవేక్షణ , స్టోర్ హౌస్ కీపర్, మరియు పరిపాలనా పర్యవేక్షకుడు వంటివి. కొత్త ఉద్యోగాల కోసం ఉపాధిని భర్తీ చేయడమే కాక, నూతన విద్యా సంవత్సరం ఇతర ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి అవకాశాన్ని కల్పించడం కోసం ఇప్పుడు చేస్తున్న వారి ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం







