650 మంది ప్రభుత్వ పాఠశాల సిబ్బంది తొలగింపు
- May 31, 2017
దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి 650 మంది ఉద్యోగులను వారి వారి విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉన్నత విద్యా మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారిక సమాచారం ద్వారా వెల్లడైంది. స్థానిక అరబిక్ రోజువారీ అర్రేయా అధికారికంగా, కార్య నిర్వహణాభివృద్ధి , కార్మిక మరియు సాంఘిక వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని పరిపాలనా ఉద్యోగాలను నియామకం జరపడానికి ఇంటర్వ్యూ నిర్వహించింది. అందులో ఎంపికైన ఖతరీ అభ్యర్థుల జాబితాలను విద్య మంత్రిత్వశాఖ అందించిందని పేర్కొంది. తొలగించబడిన ఉద్యోగాలలో అధికభాగం ఉద్యోగాలు పరిపాలనా స్వభావం కలిగినవేనని ఓ సమాచారం. అయితే అకడమిక్ ఉద్యోగాలు ఉద్యోగుల సంఖ్యలో సరి పోల్చితే కేవలం 15 శాతం మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా, తొలగించబడిన 100 మంది ప్రవాసీయులైన ఉద్యోగులు తమ పదవీకాలం ముగిసి పదవీ విరమణ వయస్సుకు చేరారు. అలాగే, మిగిలిన రద్దు చేయబడిన కొంతమంది ఉద్యోగులలో వారు తాత్కాలికంగా మాత్రమే నియమించబడ్డారు. ఖతార్ వాసులు ద్వారా భర్తీ కాబడిన పలు ఉద్యోగాల ప్రధానంగా ఏవంటే సామాజిక కార్యకర్తలు, బాలికల పాఠశాల బస్సు పర్యవేక్షణ , స్టోర్ హౌస్ కీపర్, మరియు పరిపాలనా పర్యవేక్షకుడు వంటివి. కొత్త ఉద్యోగాల కోసం ఉపాధిని భర్తీ చేయడమే కాక, నూతన విద్యా సంవత్సరం ఇతర ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి అవకాశాన్ని కల్పించడం కోసం ఇప్పుడు చేస్తున్న వారి ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









