భారత్ రైల్వే టూరిజం కార్పోరేషన్ సరికొత్త ఆఫర్
- June 02, 2017
రైలు ప్రయాణీకులకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ సరికొత్త ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ప్రకారం ఐఆర్సీటీసి వెబ్సైట్లో రిజిస్టర్ అయిన ప్రయాణీకుడు తన ప్రయాణానికి ఐదు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుని, టికెట్ తీసుకున్న 14 రోజులలోపు డబ్బులు చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం అన్ని రైళ్లకూ వర్తింపజేయనున్నట్లు ఐఆర్సీటీసి అధికార ప్రతినిధి సందీప్ దత్తా తెలిపారు. అయితే ఇలా ముందుగా టికెట్ తీసుకుని తరువాత చెల్లించే ప్రయాణీకుల నుంచి 3.5 శాతం సర్వీస్ చార్జ్ వసూలు చేయనున్నామని తెలిపారు. ఈ విధానం ప్రయాణీకులకు ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









