భారత్ రైల్వే టూరిజం కార్పోరేషన్ సరికొత్త ఆఫర్

- June 02, 2017 , by Maagulf
భారత్ రైల్వే టూరిజం కార్పోరేషన్ సరికొత్త ఆఫర్

రైలు ప్రయాణీకులకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ సరికొత్త ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఈ ఆఫర్ ప్రకారం ఐఆర్‌సీటీసి వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయిన ప్రయాణీకుడు తన ప్రయాణానికి ఐదు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకుని, టికెట్ తీసుకున్న 14 రోజులలోపు డబ్బులు చెల్లించే విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.  ఈ విధానం అన్ని రైళ్లకూ వర్తింపజేయనున్నట్లు ఐఆర్‌సీటీసి అధికార ప్రతినిధి సందీప్ దత్తా తెలిపారు.  అయితే ఇలా ముందుగా టికెట్ తీసుకుని తరువాత చెల్లించే ప్రయాణీకుల నుంచి 3.5 శాతం సర్వీస్ చార్జ్ వసూలు చేయనున్నామని తెలిపారు.  ఈ విధానం ప్రయాణీకులకు ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com