కేరళ కాథలిక్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- June 02, 2017
కేరళ కాథలిక్ అసోసియేషన్ (కెసిఎ) వేసవికాలంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 ను నిర్వహించనుంది. ఈ క్రికెట్ పోటీలలో తమ తమ జట్ల పేర్లను నమోదు చేసుకొనేందుకు సెగైయాలోని ప్రాంగణంలో జూన్ 10 వ తేదీ లోపున రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిఉంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ జూన్ 16 వ తేదీన ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అందరూ జాతీయతలు అర్హులేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎనిమిది మంది ఆటగాళ్ళు కల్గి కనీసం ఒక్కో జట్టులో ఆరుగురికి తక్కువ కాకుండా ఆటగాళ్లు ఉండాలని సూచిస్తున్నారు. సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 కు ఎంట్రీ రుసుముగా 35 బహెరిన్ దినార్లను రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ లో నియమ నిబంధనలు తరువాత జరగబోయే జట్టు నాయకుల సమావేశంలో ప్రకటించబడుతాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







