కేరళ కాథలిక్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
- June 02, 2017
కేరళ కాథలిక్ అసోసియేషన్ (కెసిఎ) వేసవికాలంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 ను నిర్వహించనుంది. ఈ క్రికెట్ పోటీలలో తమ తమ జట్ల పేర్లను నమోదు చేసుకొనేందుకు సెగైయాలోని ప్రాంగణంలో జూన్ 10 వ తేదీ లోపున రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిఉంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ జూన్ 16 వ తేదీన ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అందరూ జాతీయతలు అర్హులేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎనిమిది మంది ఆటగాళ్ళు కల్గి కనీసం ఒక్కో జట్టులో ఆరుగురికి తక్కువ కాకుండా ఆటగాళ్లు ఉండాలని సూచిస్తున్నారు. సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 కు ఎంట్రీ రుసుముగా 35 బహెరిన్ దినార్లను రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ లో నియమ నిబంధనలు తరువాత జరగబోయే జట్టు నాయకుల సమావేశంలో ప్రకటించబడుతాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









