కేరళ కాథలిక్ అసోసియేషన్ క్రికెట్ టోర్నమెంట్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రారంభం

- June 02, 2017 , by Maagulf
కేరళ కాథలిక్ అసోసియేషన్  క్రికెట్ టోర్నమెంట్ కొరకు రిజిస్ట్రేషన్ ప్రారంభం

కేరళ కాథలిక్ అసోసియేషన్ (కెసిఎ) వేసవికాలంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా  సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 ను నిర్వహించనుంది. ఈ క్రికెట్ పోటీలలో తమ తమ జట్ల పేర్లను నమోదు చేసుకొనేందుకు సెగైయాలోని ప్రాంగణంలో జూన్ 10 వ తేదీ లోపున రిజిస్ట్రేషన్  చేసుకోవాల్సిఉంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ జూన్ 16 వ తేదీన ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ లో ఆడేందుకు  రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు అందరూ జాతీయతలు అర్హులేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎనిమిది మంది ఆటగాళ్ళు కల్గి కనీసం ఒక్కో జట్టులో ఆరుగురికి తక్కువ కాకుండా ఆటగాళ్లు ఉండాలని సూచిస్తున్నారు. సమ్మర్ క్రికెట్ టోర్నమెంట్ 2017 కు ఎంట్రీ రుసుముగా 35 బహెరిన్ దినార్లను రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సి ఉంది. ఈ టోర్నమెంట్ లో నియమ నిబంధనలు తరువాత జరగబోయే జట్టు నాయకుల సమావేశంలో ప్రకటించబడుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com