తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రాబోతుంది
- June 02, 2017
బడుగుల సంక్షేమమే ఎజెండాగా తెలంగాణలో మరో పార్టీ పురుడుపోసుకుంది. ఉద్యమకారుడు చెరుకు సుదాకర్ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త పార్టీ..ప్రజల కోసమే పనిచేస్తామని ప్రకటించింది. కేసీఆర్ మూడేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఇంటి పార్టీ నేతలు.
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఉద్యమకారుడు చెరుకు సుదాకర్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన పార్టీ తొలి సభకు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.
తెలంగాణలో 80శాతం ఉన్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. మూడేళ్లు పూర్తయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించటం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నాయకులు విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదన్నారు. ప్రజల కోసమే తెలంగాణ ఇంటిపార్టీ ఏర్పడిందని చెప్పిన నాయకులు..తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









