తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రాబోతుంది
- June 02, 2017
బడుగుల సంక్షేమమే ఎజెండాగా తెలంగాణలో మరో పార్టీ పురుడుపోసుకుంది. ఉద్యమకారుడు చెరుకు సుదాకర్ ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త పార్టీ..ప్రజల కోసమే పనిచేస్తామని ప్రకటించింది. కేసీఆర్ మూడేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు తెలంగాణ ఇంటి పార్టీ నేతలు.
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఉద్యమకారుడు చెరుకు సుదాకర్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటి పార్టీ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన పార్టీ తొలి సభకు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు.
తెలంగాణలో 80శాతం ఉన్న బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తామని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. మూడేళ్లు పూర్తయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించటం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని నాయకులు విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన ఉద్యమకారులకు కనీస గౌరవం దక్కలేదన్నారు. ప్రజల కోసమే తెలంగాణ ఇంటిపార్టీ ఏర్పడిందని చెప్పిన నాయకులు..తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







