హైదరాబాద్ లో దారుణం కన్న కూతురు డెడ్బాడీని డ్రైనేజ్లో పడేసిన తండ్రి
- June 03, 2017
డ్రైనేజీలో డెడ్ బాడీ. అదేదో అనాధ శవం కాదు. కన్న తండ్రే స్వయంగా తన కూతురు మృతదేహాన్ని మురుగు కాలువలో పడేశాడు. కారణం.. పేదరికం. అంత్యక్రియలు చేయడానికి చేతిలో చిల్లుగవ్వ లేక.. మనసు చంపుకొని మరీ ఇలాంటి పని చేశాడు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ లో జరిగిందీ ఘటన.
డ్రైనేజీలో మహిళ మృతదేహం పడుందని స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చారు. వివరాలు ఆరా తీస్తే.. కన్న తండ్రే కూతురు డెడ్ బాడీని ఇలా డ్రైనేజ్ లో పడేశాడని తెలిసింది. డబ్బులు లేక పోతే.. ఎవరికైనా చెప్పాలి.. లేక పోతే, స్మశాన వాటికలో సంప్రదించాలి. అంతేగాని.. ఇలా మురుగు కాలువలో వదిలేసి వెళ్లిపోవడం ఏంటని పోలీసులు ఆ తండ్రికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







