మాదక ద్రవ్యాల వ్యాపారి అరెస్టు
- June 03, 2017మనామా : ఒక కిలోగ్రాము గంజాయితో దొరికిపోయిన ఆసియా దేశానికి చెందిన మాధకద్రవ్యాల చిరు వ్యాపారిని శుక్రవారం అరెస్టు చేసినట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. నేర పరిశోధన మరియు ఫోరెన్సిక్ సైన్స్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబుద్ధులాజిజ్ అల్ రుమేహి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టుబడిన ఆ నిందితుని వద్ద నార్కోటిక్ మాత్రలు అలాగే కిలో గంజాయిని కలిగి ఉన్నట్లు ధ్రువీకరించారు, ఆ వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్న మాత్రల విలువ 9,200 బహెరిన్ దినార్ల విలువ చేస్తుందని అలాగే ఆ మొత్తం మాదక ద్రవ్యాల అమ్మకం ద్వారా వచ్చిన సొమ్ముని నిందితుడు వివిధ దేశాల కరెన్సీలతో భద్రపర్చాడని పోలీసులు పేర్కొంటున్నారు. నిందితుని వద్ద ఉన్నమొత్తాన్ని జప్తు చేశారు. పట్టుబడిన నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ , నార్కోటిక్స్ నుండి ఒక వారెంట్ ద్వారా అరెస్ట్ చేశారు.ఈ కేసును విచారణ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









