'ప్రీ-మాన్సూన్' సేల్ అనౌన్స్ చేసిన గో-ఎయిర్
- June 03, 2017
బడ్జెట్ క్యారియర్ గో ఎయిర్ తాజాగా 'ప్రీ-మాన్ సూన్' సేల్ ను ప్రకటించింది. ఈ సేల్ కింద ఎంపికచేసిన దేశీయ రూట్లలో 999 రూపాయలకే విమాన టిక్కెట్ అందించనున్నట్టు పేర్కొంది. 48 గంటలు లేదా రెండు రోజులు అందుబాటులో ఉండే ఈ గోఎయిర్ సేల్ జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలోని ప్రయాణాలకు వర్తించనుందని ఎయిర్ లైన్స్ తెలిపింది. జూన్ 4కు ఈ ఆఫర్ ముగుస్తుంది. ఈ ఆఫర్ ను మిగతా ఏఇతర సేల్ తో కలుపబోమని ఎయిర్ లైన్ చెప్పింది. గ్రూప్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఈ స్పెషల్ ప్రమోషనల్ ధరల కింద టిక్కెట్ బుక్ చేసుకున్న వారు, తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేయమని కూడా స్పష్టంచేసింది.
ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను అందుబాటులో ఉంచుతుందో కూడా గోఎయిర్ ప్రకటించలేదు. ఫస్ట్-కమ్-ఫస్ట్-సర్వ్డ్ బేసిస్ లో సీట్లను అందుబాటులో ఉంచే అవకాశముంటుంది. గో ఎయిర్ ప్రస్తుతం 23 ప్రాంతాలకు 140 డైలీ విమానాలను, సుమారు 975 వీక్లి విమానాలను నడుపుతోంది. దేశంలో విమాన ప్రయాణికుల ట్రాఫిక్ మార్చి నెలలో 14.6 శాతం వృద్ధి నమోదుకాగ ఏప్రిల్ నెలలో 15.3 శాతానికి పెరిగిందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ డేటా తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









