భారత్-పాక్ మ్యాచ్పై ఐఎస్ఐ ఉగ్ర దాడి
- June 03, 2017
చాంపియన్స్ ట్రోఫిలో భాగంగా భారత్-పాకిస్తాన్ల బర్మింగ్హామ్లోని ఎడ్గ్బాస్టన్ మైదానాంలో జరగనున్న వన్డే మ్యాచ్పై ఐఎస్ఐ కన్ను పడింది. దాదాపు 14 మంది ఐఎస్ఐ ఏజెంట్లు ఇరుదేశాల మధ్య మ్యాచ్ను వీక్షించేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నట్లు తెలిసింది. మ్యాచ్ సందర్భంగా కశ్మీర్ వివాదంపై పోస్టర్లను ప్రదర్శించాలని ఐఎస్ఐ వీరిని కోరినట్లు సమాచారం.
కశ్మీర్కు స్వతంత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏ3 ప్లకార్డులను ప్రదర్శించాలని ఐఎస్ఐ వారి ఏజెంట్లతో పేర్కొన్నట్లు తెలిసింది. 'కశ్మీర్ తన వైపు చూడాలని కోరుకుంటోంది. కశ్మీర్ రక్తం కారుస్తోంది. మేం కశ్మీర్కు దన్నుగా నిలుస్తాం. జమ్మూకశ్మీర్కు స్వతంత్రం ఇవ్వాలి.' అనే నాలుగు నినాదాలను ప్ల కార్డుల్లో ఉంచాలని ఏజెంట్లను ఆదేశించినట్లు తెలిసింది.
మరోవైపు శనివారం రాత్రి లండన్లో ఉగ్రదాడుల జరిగిన విషయం తెలిసిందే. దీంతో బర్మింగ్హామ్లోని ఎడ్గ్బాస్టన్ గ్రౌండ్లో జరగనున్న భారత్, పాకిస్తాన్ మీద ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని ఇంగ్లండ్ ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం కూడా అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







