ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటున్న రాహుల్
- June 04, 2017
గుంటూరు: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుంటూరులో ఏర్పాటుచేసిన ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తాము తీసుకోబోయే తొలి నిర్ణయం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని రాహుల్ గుర్తుచేశారు. అయితే, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ హామీని వాయిదా వేసిందన్నారు. హోదాతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాంటి హక్కును సాధించుకొనేందుకు ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. హోదాతో కేంద్రం నుంచి వచ్చే నిధులు చంద్రబాబు, జగన్లకు ఎందుకు అవసరంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి డబ్బులు వస్తే ప్రభుత్వానికి మంచిదే కాదా.. మరెందుకు కేంద్రాన్ని అగడగంలేదు అని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







