ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటున్న రాహుల్

- June 04, 2017 , by Maagulf
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటున్న రాహుల్

గుంటూరు: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల హక్కు అని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. గుంటూరులో ఏర్పాటుచేసిన ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తాము తీసుకోబోయే తొలి నిర్ణయం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడే నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారని రాహుల్‌ గుర్తుచేశారు. అయితే, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ హామీని వాయిదా వేసిందన్నారు. హోదాతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాంటి హక్కును సాధించుకొనేందుకు ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. హోదాతో కేంద్రం నుంచి వచ్చే నిధులు చంద్రబాబు, జగన్‌లకు ఎందుకు అవసరంలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి డబ్బులు వస్తే ప్రభుత్వానికి మంచిదే కాదా.. మరెందుకు కేంద్రాన్ని అగడగంలేదు అని ఆయన ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com