ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటున్న రాహుల్
- June 04, 2017
గుంటూరు: ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. గుంటూరులో ఏర్పాటుచేసిన ఏపీ ప్రత్యేక హోదా భరోసా సభలో ఆయన ప్రసంగించారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తాము తీసుకోబోయే తొలి నిర్ణయం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించమేనన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని రాహుల్ గుర్తుచేశారు. అయితే, భాజపా నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆ హామీని వాయిదా వేసిందన్నారు. హోదాతో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని, అలాంటి హక్కును సాధించుకొనేందుకు ఇక్కడి అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోరాడటంలేదని ప్రశ్నించారు. హోదాతో కేంద్రం నుంచి వచ్చే నిధులు చంద్రబాబు, జగన్లకు ఎందుకు అవసరంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి డబ్బులు వస్తే ప్రభుత్వానికి మంచిదే కాదా.. మరెందుకు కేంద్రాన్ని అగడగంలేదు అని ఆయన ప్రశ్నించారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









