వీధి విక్రేతలపై చర్య తీసుకోవాలని దుకాణదారులు డిమాండ్
- June 05, 2017
మనామ: రాజధానిలోని పండ్లు మరియు కూరగాయల దుకాణ యజమానులు వీధి వ్యాపారవేత్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు, ఎందుకంటే వారి వ్యాపారాలు చట్టవిరుద్ధమైన విధానాల ద్వారా ప్రభావితమవుతున్నాయని ఆరోపించారు.. రాజధాని ప్రాంతంలోని అల్ ముటాసిమ్ అవెన్యూ, రోడ్ నెం 421, బ్లాక్ 304, మొత్తం అక్రమ విక్రయదారులచే ఆక్రమించబడ్డాయి. "ఈ ప్రాంతంలో నా తండ్రితో పాటు నేను ఒక పండ్లు మరియు కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాను. మొత్తం ఈ ప్రాంతం మొత్తం చట్టవిరుద్ధమైన వ్యాపారులతో ఆక్రమించబడింది. ప్రారంభంలో, కొంత మంది పనివారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు మనం కనీసం మా ఖర్చులను కట్టగలిగాము, కాని ఇప్పుడు అది పొందడం సైతం దాదాపు అసాధ్యమవుతుంది. అనధికారిక వ్యాపారులకు ఉత్పత్తి , కొనుగోలు ఖర్చు. విద్యుత్తు బిల్లులు, సి ఆర్ అద్దెకు ఇవ్వాల్సిన అవసరం లేదని దుకాణదారులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లో 30 మందికి పైగా అనధికారిక వ్యాపారుల ఉన్నారు, దీనితో మా వ్యాపారాలు మనుగడ సాధించడమనేది దాదాపు అసాధ్యం,అని ఓ అధికార వ్యాపారి అన్నారు. తమ ఫిర్యాదుకు స్పందించి అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నట్లు అన్నారు. వారు తీసుకొనే చర్య ద్వారా మా వ్యాపారాలను మనుగడ సాగించవచ్చని ఆశిస్తున్నామని అన్నారు. కనీసం గతంలో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ మరియు మునిసిపాలిటీ నుండి తనిఖీలను క్రమంగా జరిగేవని కానీ ఇప్పుడు దాదాపు ఆరు నెలల నుంచి ఇక్కడ ఎటువంటి తనిఖీలు జరగలేదు, దీనివల్ల చాలా మంది వీధి వ్యాపారులకు పెరగడానికి దారి తీసిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









