వీధి విక్రేతలపై చర్య తీసుకోవాలని దుకాణదారులు డిమాండ్
- June 05, 2017
మనామ: రాజధానిలోని పండ్లు మరియు కూరగాయల దుకాణ యజమానులు వీధి వ్యాపారవేత్తలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు, ఎందుకంటే వారి వ్యాపారాలు చట్టవిరుద్ధమైన విధానాల ద్వారా ప్రభావితమవుతున్నాయని ఆరోపించారు.. రాజధాని ప్రాంతంలోని అల్ ముటాసిమ్ అవెన్యూ, రోడ్ నెం 421, బ్లాక్ 304, మొత్తం అక్రమ విక్రయదారులచే ఆక్రమించబడ్డాయి. "ఈ ప్రాంతంలో నా తండ్రితో పాటు నేను ఒక పండ్లు మరియు కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాను. మొత్తం ఈ ప్రాంతం మొత్తం చట్టవిరుద్ధమైన వ్యాపారులతో ఆక్రమించబడింది. ప్రారంభంలో, కొంత మంది పనివారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు మనం కనీసం మా ఖర్చులను కట్టగలిగాము, కాని ఇప్పుడు అది పొందడం సైతం దాదాపు అసాధ్యమవుతుంది. అనధికారిక వ్యాపారులకు ఉత్పత్తి , కొనుగోలు ఖర్చు. విద్యుత్తు బిల్లులు, సి ఆర్ అద్దెకు ఇవ్వాల్సిన అవసరం లేదని దుకాణదారులు వాపోతున్నారు. ఈ ప్రాంతాల్లో 30 మందికి పైగా అనధికారిక వ్యాపారుల ఉన్నారు, దీనితో మా వ్యాపారాలు మనుగడ సాధించడమనేది దాదాపు అసాధ్యం,అని ఓ అధికార వ్యాపారి అన్నారు. తమ ఫిర్యాదుకు స్పందించి అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నట్లు అన్నారు. వారు తీసుకొనే చర్య ద్వారా మా వ్యాపారాలను మనుగడ సాగించవచ్చని ఆశిస్తున్నామని అన్నారు. కనీసం గతంలో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ మరియు మునిసిపాలిటీ నుండి తనిఖీలను క్రమంగా జరిగేవని కానీ ఇప్పుడు దాదాపు ఆరు నెలల నుంచి ఇక్కడ ఎటువంటి తనిఖీలు జరగలేదు, దీనివల్ల చాలా మంది వీధి వ్యాపారులకు పెరగడానికి దారి తీసిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







