భవనం పై దారుణం.. అత్యాచారానికి...హత్యకు గురైన 11 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు
- June 05, 2017
వళ్ళు తెలియని కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ పాకిస్తాన్ దుర్మార్గుడు ప్రకృతికి విరుద్ధంగా ఆడ మగ తేడా లేకుండా కామవాంఛలు తీర్చుకొన్నాడు. తన దేశానికి చెందిన ఓ 11 ఏళ్ళ బాలుడిపై లైంగిక దాడి చేసి కోరిక తీర్చుకొని ఆపై ప్రాణాలు తీసాడు. అబుదాబి పోలీసు డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తూ అల్ షరీఫీ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బాలుడు కనిపించడం లేదంటూ కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ నేపథ్యంలో, గత శనివారం బాలుడి మృతదేహం ఓ భవనంపై ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. భవనం యొక్క పైకప్పు మీద ఆ 11 ఏళ్ల బాలుడు లైంగికంగా అత్యాచారానికి గురై మరణించినట్లు పోలీసుల నేర పరిశోధనలలో తేలింది. ఆజాన్ మజిద్ గా గుర్తించబడిన ఆ బాలుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్1వ తేదీన ప్రార్థన చేయటానికి దగ్గరలో ఉన్న మసీదు వద్దకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆ బాలుడు అనూహ్యంగా ఎవరికి కనిపించకుండాపోయాడు.మరుసటిరోజు మురోర్ రోడ్లో ఉన్నతమ భవనంపై బాలుని మృతదేహం ఉన్నట్లు బంధువులు పేర్కొన్నారు. ఈ హత్య కేసులో పోలీసులు చురుకైన పరిశోధన జరిపి నిందితుడిని పట్టుకొన్నారు. ఆ హత్య లో తన ప్రమేయం ఉందని పోలీసుల ఎదుట పాకిస్థాన్ నిందితుడు ఒప్పుకున్నాడు. తాను ఆ బాలుడిని ఓ బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అత్యాచారం చేశానని . అనంతరం తన నేరం వెలుగు లోనికి రాకుండా ఉండేందుకు ఆ బాలుడికి ఊపిరాడకుండా చేసి గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకున్నాడు. బాలుడు అజాన్ మాజిద్ తండ్రి సైతం ఒక పాకిస్తానీ జాతీయుడు, స్వదేశీయుడే తన బిడ్డని దారుణంగా అత్యాచారం చేసి హతమార్చాడని విలపిస్తున్నాడు. గల్ఫ్దేశాల్లో నివసిస్తున్న కొందరు పాకిస్తాన్ పౌరులు ఇటీవల అనేక నేరాలకు పాల్పడుతున్నారు. ఆయా దేశాల్లో నమోదవుతున్న నేరాల్లో పాకిస్తానీయుల సంఖ్య అధికంగా ఉంటోంది. ముఖ్యంగా బాలికలు, బాలురపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని పలు కేసులలో ఆ విషయం నిర్ధారణ అవుతుంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకి తరలించారు.ఈ సంఘటనపై మరింత సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. బాలుడి హత్య కేసులో నిందితుడిని పట్టుకోవడంలో అబుదాబి పోలీసు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ శాఖ చేసిన ప్రయత్నాలపై పలువురి ప్రశంసలు లభించాయి. ఈ ఘటనతో ఆరోగ్యభీమా సంస్థలో ఉద్యోగిగా పనిచేసే బాలుని తండ్రి మజిద్ తీవ్ర విషాదం లో మునిగిపోయి ఉన్నాడు. ఆయనకు స్నేహితులు మరియు బంధువులు మద్దతునిచ్చారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









