జియోనీ మొబైల్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరో ప్రభాస్
- June 06, 2017
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ ను బాహుబలి కి ముందు.... బహుబలికి తర్వాత అని చెప్పవచ్చు.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కు ఉన్న క్రేజ్.. రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ ను తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకోవాలని చాలా సంస్థలు కోరుకొంటున్నాయి.. కానీ ప్రభాస్ మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.. తాజాగా ప్రభాస్ ఓ మొబైల్ కంపెనీ కి బ్రాండ్ అంబాసిడర్ గా అంగీకరించినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...
ప్రభాస్ ను జియోనీ మొబైల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఒప్పందం చేసుకొన్నట్లు మొబైల్ తయారీ సంస్థ జియోనీ ఇండియా ప్రకటించింది.. ప్రభాస్ తమ మొబైల్స్ కు ప్రచారం నిర్వహిస్తే.. తమకు ప్లస్ అవుతుందని.. తమకు ఇప్పటికే కోటి పాతిక లక్షల మందికి పైగా కస్టమర్లు ఉన్నట్లు జియోనీ సంస్థ తెలిపింది. కాగా ఈ సంస్థకు ఇప్పటికే విరాట్ కోహ్లీ, అలియాభట్, శ్రుతి హాసన్, దుల్కర్ సల్మాన్, దిల్జిత్ లు ప్రచారకర్తలుగా ఉన్నారు.. అయినా సరే ప్రభాస్ తో అగ్రిమెంట్ తో ఇండియాలో తమ మొబైల్స్ కు మరింత ఆదరణ పెరుగుతుంది అని ఈ కంపెనీ వర్గాల వారు అంటున్నారు.. ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో సినిమా చేస్తున్న సంగతి విధితమే.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







