చికాగో మహానగర తెలుగు సంస్థ టీఏజీసీ సమ్మర్ సంబరాలు
- June 06, 2017
చికాగో మహానగర తెలుగు సంస్థ (టీఏజీసీ) వేసవి కాలాన్ని ఆహ్వానిస్తూ చికాగో పరిసర ప్రాంతాలలో నివసించే తెలుగు వారికి వన భోజనాలు ఏర్పాటు చేసింది. ఈ సంబరాలు చికాగో శివార్లు ఎల్క్ గ్రోవ్ లోని బస్సేవూడ్స్ ఫారెస్ట్ ప్రిజర్వ్ లో ఘనంగా ముగిశాయి. ప్రతి ఏటా జరిగే ఈ వన భోజనాలకు ఈ ఏడాది 950కి పైగా సభ్యులు, ఇతర అతిథులు హాజరయ్యారు. టీఏజీసీ (TAGC) కార్యవర్గ సభ్యులు అందరికీ భోజనం వడ్డించారు. గ్రిల్డ్ చికెన్, దోసెలు వన భోజనాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మధ్యాహ్న భోజనం తరవాత అందరూ పుచ్చకాయ తిని, మజ్జిగ తాగి సేదతీరారు.
వన భోజనాలు అద్భుతంగా నిర్వహించినందుకు పిక్నిక్ కోర్ కమిటీ సభ్యులను టీఏజీసీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఏడే అభినందించారు. రాము బిల్లకంటి, రంగారెడ్డి లంకల, ఉమా అవధూత, విజయ్ బీరం, వాణి ఏట్రింతల, సంపత్ సంగేమ్, సాయి గొంగాటీలు వాలంటీర్స్ ను అభినందించారు. అందరినీ అలరించేందుకు ఎన్నో ఆట విడుపు కోసం మెన్స్, ఉమెన్స్, కిడ్స్ విభాగాలుగా ఎన్నో ఆటల పోటీలను నిర్వహించింది. మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, టగ్ అఫ్ వార్ ఆటలు పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గెలిచిన వారికి బహుమతులు అందజేసింది.
ఏజీసీ నిర్వహించే స్వచ్చంద సేవా కార్యక్రమాలకు ఫండ్ రైసింగ్ కు గాను రెండు మైళ్ళ నడక పోటీని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను అక్షయ విద్య ఫౌండేషన్ కు అందజేసింది. ఈ వన భోజనాల్లో భాగంగా వంటల పోటీలను నిర్వహించారు. నోరూరించే వంటలతో పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసింది.
తెలంగాణ సకినాలకు మొదటి బహుమతి, రవ్వ లడ్డులకు రెండవ బహుమతులను అందచేశారు. టీఏజీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఏడే ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ, ఈవెంట్ ను విజయవంతం చేసినందుకు కార్యవర్గ సభ్యులకు, స్పాన్సర్స్, వాలంటీర్లు సహా వచ్చిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









