మందుగుండు సామాగ్రీని ఆన్ లైన్ లో అమ్మిన వ్యక్తి అరెస్టు
- June 06, 2017
ఆమధ్య సంక్రాంతి సీజన్ లో తెలుగు రాష్ట్రాలలో ఆన్ లైన్ లో పిడకలు ..గొబ్బిమ్మలు ఆర్డర్ పై అమ్మడం..పలువురు కొనుగోలు చేయడం చూసి ఆశ్చర్యపోయాం .ప్రమాదం లేని పేడ తాలూకా వస్తువులు ..కనుక ఆపై పండుగ సమయంలో అంతగా లభ్యత ఉండదు కాబట్టి..ఆ విన్నూత్న ఆలోచన చేసి ఆన్లైన్ లో వ్యాపారం చేసిన వ్యక్తిని అందరూ అభినందించారు. అదే రీతిలో మందుగుండు సామాగ్రిని సోషల్ మీడియా ద్వారా విక్రయించడానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముహర్రక్ గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ చేసిన ఒక ప్రకటన ప్రకారం, అనుమానిత వ్యక్తిని అరెస్టు చేశారు, పోలీసులు ఒక చిట్కాని ఉపయోగించి ఆన్ లైన్ లో 900 ప్యాకెట్ల మందుగుండు సామాగ్రీ కావాలని ఆర్డర్ ఇచ్చారు. . కింగ్ ఫాహ్డ్ కాజ్వే ద్వారా అందచేసినందుకు నిందితుడు ఏర్పాట్లు చేశాడు. అరెస్ట్ కాబడిన ఆ నిందితుడు తన ఆరోగ్య పరిస్థితిని బాగోలేనందున ఆన్లైన్ లో ఈ వ్యాపారం మొదలుపెట్టినట్లు తెలిపాడు ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సూచించి నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. పేలుడు సామగ్రి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిపై 1976 లో 16 వ చట్టానికి సంబంధించిన 2 వ అధికరణ ప్రకారం, పేలుడు పదార్థాలను కలిగి ఉన్న వారెవరైనా రెండు నుండి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మరియు 50 నుండి 200 బహారిన్ దినార్ల మధ్య జరిమానా విధించనున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









