జెట్ ఎయిర్వేస్ మెంబర్స్ కోసం బోనస్ జెపి మైల్స్
- June 06, 2017
జెట్ ఎయిర్వేస్, జెట్ ప్రివిలేజ్ మెంబర్స్ కోసం సరికొత్త ఆఫర్ని తీసుకొచ్చింది. జూన్ 24 నుంచి బుక్ చేసుకునే టిక్కెట్లకు అత్యధికంగా మూడు రెట్ల బోనస్ జెపి మైల్స్ని అందించనుంది. ఒమన్ నుంచి వెళ్ళే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ జెట్ ప్రివిలేజ్కి సంబంధించిన మెంబర్స్ అందరికీ వర్తిస్తుంది. ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు జూన్ 28 నుంచి డిసెంబర్ 6 మధ్యలో ప్రయాణించాల్సి ఉంటుంది. జెట్ ఎయిర్ వేస్ ఒమన్ జనరల్ మేనేజర్ వాసిమ్జైది మాట్లాడుతూ, ఫెస్టివ్ సీజన్, అలాగే స్కూల్ హాలీడేస్ నేపథ్యంలో ప్రయాణీకులకు అద్భుతమైన ప్రయాణానుభూతితోపాటు, ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జెట్ ఎయిర్ వేస్ వెబ్సైట్ ద్వారా జెట్ ప్రివిలేజ్ ప్రోగ్రామ్లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి వీలుంది. ఆ వెంటనే జెపి మైల్స్ బోనస్ పాయింట్స్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







