10 మిలియన్‌ దిర్హామ్‌ల టైర్‌ ఫెసిలిటీ ప్రారంభం

- June 06, 2017 , by Maagulf
10 మిలియన్‌ దిర్హామ్‌ల టైర్‌ ఫెసిలిటీ ప్రారంభం

దుబాయ్‌లో 10 మిలియన్‌ దిర్హామ్‌ల ఖర్చుతో ట్రక్‌ టైర్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. బ్రిడ్జిస్టోన్‌ సంస్థకు చెందిన ఈ సెంటర్‌ని నాజర్‌ బిన్‌ అబ్దుల్‌ అతీఫ్‌ ప్రారంభించారు. దుబాయ్‌ మునిసిపాలిటీ సహకారంతో ఈ సెంటర్‌ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో, అవసరమైన అన్ని ఫెసిలిటీస్‌నీ ఈ సెంటర్‌లో ఏర్పాటు చేశామని వివరించారు. సేఫ్‌, హెల్తీ, ఎన్విరాన్‌మెంటల్‌ ఫ్రెండ్లీ వంటి ప్రత్యేకతలతో ఈ సెంటర్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్‌ ప్రకారం ట్రక్‌ మార్కెట్‌ అమ్మకాలు యూఏఈలో ఏడాదికేడాదీ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయనీ, 2021 వరకు ఎనిమిది శాతం వృద్ధిరేటుని నమోదు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com