అసత్య ఆరోపణలతోనే తెగతెంపులు
- June 06, 2017
సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ తమతో సంబంధాలు తెంచుకోవడం వెనుక అసత్యాల ప్రచారమే కీలక భూమిక పోషించిందని ఖతార్ క్యాబినెట్ తీర్మానించింది. ఖతార్తో పలు దేశాలు తమ బోర్డర్ని మూసివేయడం, అలాగే ఎయిర్ కనెక్టివిటీని రద్దు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్ని ఖతార్ క్యాబినెట్ మీక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా మీడియా సైతం వాస్తవాల్ని పరిగణనలోకి తీసుకోకపోవడం పట్ల ఖతార్ అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. క్యాబినెట్ ఎక్స్ట్రార్డినరీ మీటింగ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని నేతృత్వంలో ఎమిర్ దివాన్లో జరిగింది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ జైద్ అల్ మహమౌద్ మాట్లాడుతూ సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్ జారీ చేసిన స్టేట్మెంట్స్ని క్యాబినెట్ రివ్యూ చేసిందని అన్నారు. ఖతార్ ఇప్పటికీ పొరుగుదేశాలతో కలిసి వివిధ అంశాల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉందనీ, రీజియన్ అభివృద్ధికి కట్టుబడి ఉందనీ, తీవ్రవాదంపై పోరులో రాజీపడే ప్రసక్తే లేదని ఖతార్ పేర్కొంది. ఖతార్ ప్రజలు జరుగుతున్న దుష్ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇంకో వైపున ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, కువైట్ ఎమిర్ షేక్ సబా అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సుమాన్తో ఫోన్లో మాట్లాడారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









