నేపాల్ ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్బా
- June 06, 2017
నేపాల్ తదుపరి ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్బా (72) ఎన్నికయ్యారు. ప్రచండ రాజీనామా నేపథ్యంలో పార్లమెంట్లో చేపట్టిన ఓటింగ్ ద్వారా దేవ్బాను తదుపరి ప్రధానిగా ఎన్నుకున్నారు. నేపాల్ పార్లమెంట్లో మొత్తం 593 మంది సభ్యులకు గాను 388 మంది ఆయనకు అనుకూలంగా.. 170 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. 35 మంది గైహాజరయ్యారు. దీంతో నాలుగోసారి నేపాల్ ప్రధానిగా దేవ్బా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నేపాల్ ప్రధానిగా పుష్పకమల్ దహాల్ ప్రచండ తన పదవికి గత నెల 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధికార మార్పిడిపై నేపాలీ కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరిస్తూ ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 2016 ఆగస్టులో ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు-సెంటర్) నేపాలీ కాంగ్రెస్తో జతకట్టి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







