నేపాల్ ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్బా
- June 06, 2017
నేపాల్ తదుపరి ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్బా (72) ఎన్నికయ్యారు. ప్రచండ రాజీనామా నేపథ్యంలో పార్లమెంట్లో చేపట్టిన ఓటింగ్ ద్వారా దేవ్బాను తదుపరి ప్రధానిగా ఎన్నుకున్నారు. నేపాల్ పార్లమెంట్లో మొత్తం 593 మంది సభ్యులకు గాను 388 మంది ఆయనకు అనుకూలంగా.. 170 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. 35 మంది గైహాజరయ్యారు. దీంతో నాలుగోసారి నేపాల్ ప్రధానిగా దేవ్బా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నేపాల్ ప్రధానిగా పుష్పకమల్ దహాల్ ప్రచండ తన పదవికి గత నెల 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధికార మార్పిడిపై నేపాలీ కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరిస్తూ ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 2016 ఆగస్టులో ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు-సెంటర్) నేపాలీ కాంగ్రెస్తో జతకట్టి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









