నేపాల్ ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్బా
- June 06, 2017
నేపాల్ తదుపరి ప్రధానిగా నేపాలీ కాంగ్రెస్ ఛైర్మన్ షేర్ బహదూర్ దేవ్బా (72) ఎన్నికయ్యారు. ప్రచండ రాజీనామా నేపథ్యంలో పార్లమెంట్లో చేపట్టిన ఓటింగ్ ద్వారా దేవ్బాను తదుపరి ప్రధానిగా ఎన్నుకున్నారు. నేపాల్ పార్లమెంట్లో మొత్తం 593 మంది సభ్యులకు గాను 388 మంది ఆయనకు అనుకూలంగా.. 170 మంది వ్యతిరేకంగా ఓటువేశారు. 35 మంది గైహాజరయ్యారు. దీంతో నాలుగోసారి నేపాల్ ప్రధానిగా దేవ్బా బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు.
నేపాల్ ప్రధానిగా పుష్పకమల్ దహాల్ ప్రచండ తన పదవికి గత నెల 24న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధికార మార్పిడిపై నేపాలీ కాంగ్రెస్ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అనుసరిస్తూ ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. 2016 ఆగస్టులో ప్రచండ నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు-సెంటర్) నేపాలీ కాంగ్రెస్తో జతకట్టి దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









