టర్కీ పేలుళ్ళను ఖండించిన ఖతార్
- October 11, 2015
టర్కీ రాజధాని అంకారాలో తీవ్రవాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడటాన్ని ఖతార్ ఖండించింది. సామాన్యుల్ని చంపడం దుర్మార్గమని ఖతర్ ఓ ప్రకటనలో తెలిపింది. టర్కీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఖతార్ ఎప్పుడూ ముందుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఖతార్ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. అంకారాలో జరిగిన పేలుళ్ళలో 95 మందికి పైగా సామాన్యులు మృత్యువాత పడ్డారు. టర్కీ పేలుళ్ళను ఎమిర్ షేక్ తమిమ్ అబ్దుల్లా హమాద్ అల్ థనీ ఖండించారు. టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో ఎమిర్ షేక్ ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు ఎమిర్ షేక్.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









