టర్కీ పేలుళ్ళను ఖండించిన ఖతార్
- October 11, 2015
టర్కీ రాజధాని అంకారాలో తీవ్రవాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడటాన్ని ఖతార్ ఖండించింది. సామాన్యుల్ని చంపడం దుర్మార్గమని ఖతర్ ఓ ప్రకటనలో తెలిపింది. టర్కీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఖతార్ ఎప్పుడూ ముందుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఖతార్ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. అంకారాలో జరిగిన పేలుళ్ళలో 95 మందికి పైగా సామాన్యులు మృత్యువాత పడ్డారు. టర్కీ పేలుళ్ళను ఎమిర్ షేక్ తమిమ్ అబ్దుల్లా హమాద్ అల్ థనీ ఖండించారు. టర్కీ ప్రెసిడెంట్ రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్తో ఎమిర్ షేక్ ఫోన్లో మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు ఎమిర్ షేక్.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







