టర్కీ పేలుళ్ళను ఖండించిన ఖతార్‌

- October 11, 2015 , by Maagulf
టర్కీ పేలుళ్ళను ఖండించిన ఖతార్‌

టర్కీ రాజధాని అంకారాలో తీవ్రవాదులు బాంబు పేలుళ్ళకు పాల్పడటాన్ని ఖతార్‌ ఖండించింది. సామాన్యుల్ని చంపడం దుర్మార్గమని ఖతర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. టర్కీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఖతార్‌ ఎప్పుడూ ముందుంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఖతార్‌ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. అంకారాలో జరిగిన పేలుళ్ళలో 95 మందికి పైగా సామాన్యులు మృత్యువాత పడ్డారు. టర్కీ పేలుళ్ళను ఎమిర్‌ షేక్‌ తమిమ్‌ అబ్దుల్లా హమాద్‌ అల్‌ థనీ ఖండించారు. టర్కీ ప్రెసిడెంట్‌ రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌తో ఎమిర్‌ షేక్‌ ఫోన్‌లో మాట్లాడారు. జరిగిన ఘటన దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు ఎమిర్‌ షేక్‌. 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com