కేరళ ఎమ్మెల్యే కూతురు పెళ్ళికి ధరించిన నగలతో ప్రజలు షాక్
- June 07, 2017
దేశంలోనే అత్యంధికంగా బంగారం కొనే రాష్ట్రం కేరళ అని వాసికెక్కిన సంగతి విధితమే.. ఇటీవల సెలబ్రేటీల ఇంట్లో పెళ్లిళ్లు.. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.. తాజాగా కేరళలో ఓ వామపక్ష నేత ఇంట్లో జరిగిన కూతురు పెళ్లి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. ఆమె ధరించిన నగలు హాట్ హాట్ టాపిక్ గా మరారింది.. వివరాల్లోకి వెళ్తే...
కేరళ కు చెందిన సీపీఐ ఎమ్మెల్యే గీతా గోపి కుమార్తె పెళ్లి గత ఆదివారం త్రిశూర్ లో జరిగింది.. ఈ పెళ్ళిలో పెళ్లికూతురు ధరించిన నగల ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది.. దీంతో వామ్మో ఇన్ని బంగారు నగలా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు.. ఓ ఎమ్మెల్యే కూతురు వంటి పై ఇన్ని నగలు ఎలా వచ్చాయి అని ప్రశ్నిస్తున్నారు.. కాగా తన కూతురు పెళ్ళికి ధరించిన నగల విషయంపై సదరు ఎమ్మెల్యే స్పందిస్తూ.. దక్షిణ భారత దేశంలో నగలకు, సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు.. అందుకే తన కూతురి పెళ్ళికి సంప్రదాయం పాటిస్తూ.. నగలను చేయించాను అని సమర్ధించుకొన్నాడు.. కాగా సీపీఐ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్న ఈ గీతా గోపి.. తన పార్టీ సిద్దాంతలను పక్కన పెట్టి.. కూతురు విషయంలో పెళ్లి సిద్ధాంతాన్ని పాటించాడు.. అని అంటున్నారు.. దేశంలో రాజకీయ నాయకుల ఇంట్లో ఉండే బంగారం బయటకు తీస్తే.. భారత దేశంలో పేదరికమే ఉండదు అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







