ఆగష్టులో జరిగిన సిరియా లో నరమేధానికి ప్రత్యక్ష సాక్షి.. నాటి బాలుడు.. నేడు ఇలా

- June 07, 2017 , by Maagulf
ఆగష్టులో జరిగిన సిరియా లో నరమేధానికి ప్రత్యక్ష సాక్షి.. నాటి బాలుడు.. నేడు ఇలా

సిరియా నర మేధానికి ప్రత్యక్ష సాక్షి ఈ అమాయక బాలుడు అంటూ.. గత ఆగష్టులో జరిగిన బాంబు దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఓ 5 ఏళ్ల చిన్నారి బాలుడిని ప్రపంచానికి మీడియా.. సోషల్ మీడియా పరిచయం చేసింది.. అప్పటి ఫోటోలో బాలుడు ని చూసిన ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురి అవ్వడమే కాదు.. ఆ ఫోటోలో ఈ బాలుడు రక్తమోడుతున్న ముఖంతో... కన్నీరు .. భయం.. కలిసిన ఓ కుర్చీలో కూర్చున్న బాలుడు ఇప్పటికీ అందరి మదిలోనూ చెరగని జ్ఞాపకంగా ఉండే ఉండిఉంటాడు.. ఆ బాలుడు ఇప్పుడు చలాకీ కుర్రాడుగా మారాడు.. వివరాల్లోకి వెళ్తే...
సిరియాలో అలెప్పో లో జరిగిన దాడుల్లో డక్నీష్ అన్న 10 ఏళ్ళ అలీ మరణించగా,, 5 ఏళ్ల ఒమ్రాన్ డక్నీష్ గాయపడ్డాడు.. ఈ చిన్నారిని ఒకరు రక్షించి అంబులెన్స్ లో చేర్చగా... ఆస్పత్రిలో చాలా కాలం పాటు చికిత్స ను పొందాడు.. ఇటీవల డిశ్చార్జ్ అయిన ఈ చిన్నారి.. తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు.. ఇతని ఫ్యామిలీని లేబసీస్ టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేసింది.. ఈ ఇంటర్వ్యూలో భయం ఛాయలు పోనీ ఈ బాలుడు మాట్లాడలేక పోయాడు.. భయం భయంగా తండ్రి ఒడిలో నే కూర్చున్నాడు.. దీంతో ఆ యాంకర్ ఆనాటి భయంకరమైన దృశ్యాలు.. జ్ఞాపకాలు డిక్నీష్ ను వెంటాడుతున్నట్లు ఉన్నాయని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com