ఖతార్పై సింపతీ చూపితే కఠిన చర్యలు
- June 07, 2017
యూఏఈ: సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో ఖతార్పై సింపతీ చూపినట్లయితే కఠిన చర్యలకు గురవుతారని యూఏఈ అటార్నీ జనరల్ హెచ్చరించారు. డాక్టర్ హమాద్ సైఫ్ అల్ షమ్షి మాట్లాడుతూ, ఖతార్ విషయంలో యూఏఈ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుందనీ, యూఏఈ ఇతర జిసిసి అలాగే అరబ్ నేషన్స్ పట్ల ఖతార్ అనుసరిస్తున్న వైఖరి అభ్యంతరకరంగా ఉండటం వల్లే కఠిన నిర్ణయాలు తప్పలేదని చెప్పారు. యూఏఈ నేషనల్ సెక్యూరిటీని కాపాడేందుకోసం తీసుకున్న కఠిన చర్యల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన సూచించారు. ఖతార్పై ఏ రూపంలో సానుభూతి తెలిపినా చట్టపరమైన చర్యలను కొనితెచ్చుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికల్ని బేఖాతరు చేసేవారికి 3 నుంచి 15 ఏళ్ళ జైలు శిక్ష, 500,000 తక్కువ కాకుండా జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







