న్యూజెర్సీకి చేరిన సాయి పాదుక యాత్ర
- June 07, 2017
అమెరికాలో షిరిడి ఆలయం నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న న్యూజెర్సీలోని సాయి దత్త పీఠం... తన లక్ష్య సాధనలో కీలకమైన ఓ ఘట్టాన్ని పూర్తి చేసింది. షిరిడి నిర్మాణ స్థలం కొనుగోలు కోసం విరాళాలను సేకరించడానికి 'సాయి దత్తపీఠం స్థల సేవ' పేరుతో అమెరికాలోని న్యూజెర్సీ నుంచి ప్రారంభమైన సాయి పాదుక యాత్ర... 43 రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో కొనసాగి చివరకు మళ్లీ మంగళవారం న్యూజెర్సీకి చేరింది. ఈ సందర్భంగా చేపట్టిన ముగింపు యాత్రకు ప్రవాసాంధ్ర భక్తులు నీరాజనాలు పట్టారు. 5మైళ్లు సాగిన ఈ ముగింపు యాత్రలో వందకుపైగా కార్లతో భక్తులు హాజరయ్యారు. ముందు న్యూజెర్సీలోని మేడిచర్ల మురళికృష్ణ నివాసంలో సాయిపాదుక పూజ నిర్వహించారు. తరువాత పల్లకీ దాత కనికిచర్ల లీలాకృష్ణ నివాసంలో ఆఖరి పాదుక పూజ నిర్వహించి యాత్ర ప్రారంభించారు. స్థానిక పోలీస్ యంత్రాంగం దీనికి సహకరించింది. సాయి దత్తపీఠం సభ్యులు, భక్తులు వందల మంది యాత్రలో పాల్గొన్నారు.
దత్తపీఠం ప్రధాన నిర్వాహకుడు ధర్మశ్రీ రఘుశర్మ శంకరమంచి నేతృత్వంలో రెండేళ్ల నుంచి అమెరికాలోని 43 రాష్ట్రాల్లో 75 వేల మైళ్ల దూరం పాదుక యాత్ర సాగింది. దత్తపీఠం సిద్ధంచేసిన సాయిరథం ద్వారా ఈ పాదుక యాత్ర 43 రాష్ట్రాల్లో దాదాపు 2వేల ఇళ్లకు చేరుకొని సాయిపాదుక పూజ చేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









