ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన యువతకు జాబ్ మేళా
- June 07, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి పరిధిలోని గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఆర్డీఏ సంస్ధ భారీ ఎత్తున ఉద్యోగమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఈ నెల 8న మంగళగిరి మండలం నవులూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువకులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సాంకేతిక అర్హతలతో పాటు, ఇతర అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నారు. ఈ మేళాలో 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. రాజధాని ప్రాంతంలోని 24 గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హులు. భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ మేళా ద్వారా వివిధ ఉద్యోగాలకు 885 మందిని ఎంపిక చేయనున్నారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









