ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన యువతకు జాబ్ మేళా
- June 07, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి పరిధిలోని గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఆర్డీఏ సంస్ధ భారీ ఎత్తున ఉద్యోగమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఈ నెల 8న మంగళగిరి మండలం నవులూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువకులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సాంకేతిక అర్హతలతో పాటు, ఇతర అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నారు. ఈ మేళాలో 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. రాజధాని ప్రాంతంలోని 24 గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హులు. భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ మేళా ద్వారా వివిధ ఉద్యోగాలకు 885 మందిని ఎంపిక చేయనున్నారు.
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







