ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన యువతకు జాబ్ మేళా

- June 07, 2017 , by Maagulf
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన యువతకు జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి పరిధిలోని గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఆర్‌డీఏ సంస్ధ భారీ ఎత్తున ఉద్యోగమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి.  ఈ నెల 8న మంగళగిరి మండలం నవులూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు.  రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువకులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.  సాంకేతిక అర్హతలతో పాటు, ఇతర అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నారు.  ఈ మేళాలో 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి.  రాజధాని ప్రాంతంలోని 24 గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హులు.  భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ మేళా ద్వారా వివిధ ఉద్యోగాలకు 885 మందిని ఎంపిక చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com