ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన యువతకు జాబ్ మేళా
- June 07, 2017
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి పరిధిలోని గ్రామాల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సీఆర్డీఏ సంస్ధ భారీ ఎత్తున ఉద్యోగమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. ఈ నెల 8న మంగళగిరి మండలం నవులూరులో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసేందుకు యువకులను ఎంపిక చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సాంకేతిక అర్హతలతో పాటు, ఇతర అర్హతలున్న వారిని ఎంపిక చేయనున్నారు. ఈ మేళాలో 17 ప్రముఖ సంస్థలు పాల్గొంటాయి. రాజధాని ప్రాంతంలోని 24 గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హులు. భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసింది. ఈ మేళా ద్వారా వివిధ ఉద్యోగాలకు 885 మందిని ఎంపిక చేయనున్నారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









