హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం 40 మంది మృతి
- June 08, 2017
హరారే: హరారేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 43 మంది అక్కడికి అక్కడే మృతి చెందారు. జాంబియా వెళ్తుండగా హురుగ్వేలోని న్యామకేత్ ప్రాంతంలో కింగ్ లయన్ బస్సు ప్రమాదానికి గురవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.
మరో 24 మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు ఓ చెట్టును ఢీకొట్టిందని, దీంతో ప్రయాణీకులు మృతి చెందారని పోలీసు అధికారి చారిటీ చరంబ తెలిపారు.
ఆ సమయంలో బస్సు వేగంగా వెళ్తోందని, డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో విఫలమయ్యాడని చెప్పారు. ఇటీవలే కొద్ది నెలల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది చనిపోయారని, మళ్లీ మరో సంఘటన విషాదకరమని ఆ అధికారి అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ









