నూతన అధ్యాయాన్ని లిఖించిన బోపన్న
- June 08, 2017
పారిస్: భారత టెన్నిస్ సంచలనం రోహన్ బోపన్న తన కెరీర్ లో నూతన అధ్యాయాన్ని లిఖించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్ ను సాధించడం ద్వారా కొత్త చరిత్రను సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ లో భాగంగా మిక్స్ డ్ డబుల్స్ ఫైనల్లో గాబ్రియేలా దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. గురువారం జరిగిన తుది పోరులో రోహన్ బోపన్న- దబౌస్కీ జోడి 2-6, 6-2, 12-10 తేడాతో అనాలెనా గ్రోన్ఫెల్డ్ (జర్మనీ)–రాబర్ట్ ఫరా (కొలంబియా)పై గెలిచి టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
హోరాహోరీగా జరిగిన పోరులో అత్యంత ఆత్మవిశ్వాసం కనబరిచిన బోపన్న-దబౌస్కీ జోడి కడవరకూ పోరాడి టైటిల్ ను సాధించారు. తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ, ఆ తరువాత రెండు సెట్లలో ఈ జోడి చెలరేగి ఆడింది. ప్రధానంగా చివరి సెట్ మాత్రం నువ్వా-నేనా అన్న రీతిలో ఉత్కంఠభరింతగా సాగింది. అయితే ఒత్తిడిన అధిగమించిన బోపన్న జోడి చివరకు విజేతగా నిలిచింది. తాజా టైటిల్ తో భారత దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్ల జాబితాలో బోపన్న చేరిపోయాడు. అంతకుముందు భారత తరపున లియాండర్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలకు మాత్రమే గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను సాధించగా, ఆ తరువాత స్థానంలో బోపన్న నిలిచాడు. 2010లో తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల డబుల్స్ లో ఫైనల్ కు చేరిన బోపన్న.. అప్పుడు గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సాధించడంలో విఫలమయ్యాడు.
తాజా వార్తలు
- బర్కాలో భారీగా నకిలీ వాహన విడిభాగాల స్వాధీనం..ముగ్గురికి జైలు, జరిమానా
- ఆఫ్రికా నుండి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్
- యూఏఈ జాతీయ ప్రతిజ్ఞకు ఆన్లైన్లో మద్దతు తెలిపే అవకాశం..
- జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్
- తెలంగాణకు భారీ వర్ష సూచన..రెడ్ అలర్ట్ జారీ
- యూఏఈ–అమెరికా ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యం మరింత బలోపేతం
- ఎబోలా అప్రమత్తత: మూడు దేశాల ప్రయాణికులపై అదనపు ఆంక్షలు విధించిన యూఏఈ
- విదేశీ పెట్టుబడులు పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న 6 కీలక నిర్ణయాలు ఇవే!
- రాష్ట్ర పురోగతిలో భాగస్వాములు కావాలని రష్యా పారిశ్రామిక సంస్థలకు మంత్రి లోకేశ్ పిలుపు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్









