ఏపీఎన్ఆర్టీ సీఈవోగా సాంబశివరావు నియమితులయ్యారు
- June 08, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు కార్పొరేషన్.. ఏపీఎన్ఆర్టీ సీఈవోగా కె.సాంబశివరావు నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా డి.మార్కండేయులు బాధ్యతలు చేపట్టనున్నారు. అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఈవోగా ఉన్న కె.నాగేశ్వరరావును విజయనగరం జేసీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సాల్మన్ రాజ్కుమార్ విజయనగరం జిల్లా డీఆర్వోగా బదిలీ అయ్యారు. కడప డీఆర్డీఏ పీడీగా ఎల్.విజయచందర్ను నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిఫ్యూటీ కలెక్టర్ వైవీ సత్యభాస్కర్ను సీసీఎల్ఏలో సహాయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో డిఫ్యూటీ కలెక్టర్ గౌతమిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉప జేఈవోగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నాన్రాజును విపత్తుల నిర్వహణ కేంద్రం కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా నియమించారు. నెల్లూరులో పనిచేస్తున్న కనక నర్సారెడ్డిని చిత్తూరు జిల్లా షెడ్యూలు కులాల సేవా సహకార సంఘం ఈడీగా నియమించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







