ఏపీఎన్ఆర్టీ సీఈవోగా సాంబశివరావు నియమితులయ్యారు
- June 08, 2017
ఆంధ్రప్రదేశ్ ప్రవాస తెలుగు కార్పొరేషన్.. ఏపీఎన్ఆర్టీ సీఈవోగా కె.సాంబశివరావు నియమితులయ్యారు. రాష్ట్రంలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా డి.మార్కండేయులు బాధ్యతలు చేపట్టనున్నారు. అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఈవోగా ఉన్న కె.నాగేశ్వరరావును విజయనగరం జేసీగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సాల్మన్ రాజ్కుమార్ విజయనగరం జిల్లా డీఆర్వోగా బదిలీ అయ్యారు. కడప డీఆర్డీఏ పీడీగా ఎల్.విజయచందర్ను నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న డిఫ్యూటీ కలెక్టర్ వైవీ సత్యభాస్కర్ను సీసీఎల్ఏలో సహాయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో డిఫ్యూటీ కలెక్టర్ గౌతమిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉప జేఈవోగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న నాన్రాజును విపత్తుల నిర్వహణ కేంద్రం కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిన్)గా నియమించారు. నెల్లూరులో పనిచేస్తున్న కనక నర్సారెడ్డిని చిత్తూరు జిల్లా షెడ్యూలు కులాల సేవా సహకార సంఘం ఈడీగా నియమించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









