జులైలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన
- June 08, 2017
భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై 4 నుంచి మూడు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరపనున్న ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కూడా మోదీయే కావడం విశేషం. తొలి రోజు సాయంత్రం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరపనున్నారు. మరుసటి రోజున టెల్ అవివ్లో భారత సంతతి ప్రజల సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు 80 వేల మంది భారతీయ యూదులు ఉన్నారు. వీరిని ఇక్కడ నాలుగు సామాజిక వర్గాలుగా...బెనె ఇజ్రాయెల్, కొచ్చినీస్, బాగ్దాదీస్, బెనయ్ మెనాషే...గుర్తిస్తున్నారు.యూదులను వేధించని దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే కావడం విశేషం. మోదీకి ఘనంగా స్వాగతం పలకడానికి వీరంతా ఇప్పటికే వెబ్సైట్ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







