జులైలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన
- June 08, 2017
భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై 4 నుంచి మూడు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరపనున్న ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కూడా మోదీయే కావడం విశేషం. తొలి రోజు సాయంత్రం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరపనున్నారు. మరుసటి రోజున టెల్ అవివ్లో భారత సంతతి ప్రజల సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు 80 వేల మంది భారతీయ యూదులు ఉన్నారు. వీరిని ఇక్కడ నాలుగు సామాజిక వర్గాలుగా...బెనె ఇజ్రాయెల్, కొచ్చినీస్, బాగ్దాదీస్, బెనయ్ మెనాషే...గుర్తిస్తున్నారు.యూదులను వేధించని దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే కావడం విశేషం. మోదీకి ఘనంగా స్వాగతం పలకడానికి వీరంతా ఇప్పటికే వెబ్సైట్ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









