హీరోయిన్ నటి త్రిషకు రూ.1.15 కోట్ల జరిమానా

- June 08, 2017 , by Maagulf
హీరోయిన్ నటి త్రిషకు రూ.1.15 కోట్ల జరిమానా

సినీ నటి త్రిషకు విధించిన రూ.1.15 కోట్ల జరిమానాను ట్రిబ్యునల్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఐటీ శాఖ మద్రాసు హైకోర్టులో అప్పీలుకు వెళ్లింది.  2010-11వ సంవత్సరంలో తన ఆదాయం రూ.89 లక్షలంటూ త్రిష అడ్వాన్స్ రిటర్ను దాఖలు చేశారు.  సినిమాల్లో నటించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తాలను ఇందులో కలపలేదు.  దాంతో, అడ్వాన్సులు కూడా ఆదాయం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసిన ఐటీ శాఖ.. రూ.1.15 కోట్ల జరిమానా విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిష దాఖలు చేసిన కేసులో ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ గురువారం మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసింది.  ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను కోర్టు జూన్ 13వ తేదీకి వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com