హీరోయిన్ నటి త్రిషకు రూ.1.15 కోట్ల జరిమానా
- June 08, 2017
సినీ నటి త్రిషకు విధించిన రూ.1.15 కోట్ల జరిమానాను ట్రిబ్యునల్ రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఐటీ శాఖ మద్రాసు హైకోర్టులో అప్పీలుకు వెళ్లింది. 2010-11వ సంవత్సరంలో తన ఆదాయం రూ.89 లక్షలంటూ త్రిష అడ్వాన్స్ రిటర్ను దాఖలు చేశారు. సినిమాల్లో నటించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తాలను ఇందులో కలపలేదు. దాంతో, అడ్వాన్సులు కూడా ఆదాయం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసిన ఐటీ శాఖ.. రూ.1.15 కోట్ల జరిమానా విధించింది. దీనిని వ్యతిరేకిస్తూ త్రిష దాఖలు చేసిన కేసులో ట్రిబ్యునల్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ గురువారం మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటీషన్ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్లతో కూడిన ధర్మాసనం కేసు విచారణను కోర్టు జూన్ 13వ తేదీకి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









