బయటకు రాని గోపిచంద్ 'బుల్లెట్'
- June 09, 2017
గోపిచంద్- నయనతార జంటగా బి. గోపాల్ దర్శకత్వం లో తెరకెక్కిన "ఆరడుగుల బుల్లెట్" ఈ వారం కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు..మూడేళ్లు గా విడుదలకు నోచుకోకుండా ల్యాబ్ కే అంకితం అయినా ఈ మూవీ , ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తుందని నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుకొచ్చారు. వీరి హడావిడి చూసి అంత వస్తుందని అనుకున్నారు.
కానీ చివర్లో కొన్ని ఫైనన్షియల్ ఇబ్బందుల కారణంగా సినిమా రిలీజ్ కు అంతరాయం ఏర్పడిందని ఫిలిం సర్కిల్లో చెపుతున్నారు. మొదటి షో మాత్రమే కాన్సల్ అయ్యిందని అన్నారని కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈరోజు ఈ మూవీ రిలీజ్ కావడం లేదని అర్ధం అవుతుంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడడం తో థియేటర్స్ లో కంటే డైరెక్ట్ గా బుల్లితెర ఫై ప్రసారం చేస్తే బాగుందనే కామెంట్స్ వేస్తున్నారు. నిజంగా గోపీచంద్ కు ఈ మూవీ ఓ చేదు అనుభవం గా మిగిలిపోయిందని చెప్పవచ్చు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







