ఎన్టీయార్ 'జైలవకుశ' కోసం భారీ సెట్
- June 09, 2017
వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీయార్ ప్రస్తుతం బాబి దర్శకత్వంలో 'జైలవకుశ' సినిమా చేస్తున్నారు. నందమూరి కల్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీయార్ తన కాల్షీట్లను పూర్తిగా ఈ సినిమాకే కేటాయించడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ సినిమా పూర్తయిపోతుందట. ఎన్టీయార్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ వేశారట. రామోజీ ఫిల్మ్సిటీలో రెండు కోట్ల రూపాయల వ్యయంతో ఓ భారీ ఇండోర్ సెట్ వేశారట. ప్రస్తుతం ఈ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







