అంతరిక్ష గ్రహానికి మన తెలుగమ్మాయి పేరు
- June 09, 2017
బెంగళూరుకు చెందిన పింగళి సాహితికి అరుదైన గుర్తింపు దక్కనుంది. 12వ తరగతి చదువుతున్న ఆ బాలిక పేరును ఓ గ్రహానికి పెట్టాలని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నిర్ణయించింది. ఇటీవల అమెరికాలోని లాస్ఏంజెల్స్లో నిర్వహించిన ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫేయిర్లో మూడు ప్రత్యేక అవార్డులు సాధించడం.. హ్యూస్టన్లో ఇంటర్నేషనల్ సస్టెయనబుల్ వరల్డ్ ఇంజినీరింగ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ప్రాజెక్టు నిర్వహించిన ఒలింపియాడ్లో ఆ బాలిక బంగారు పతకం గెలుపొందడంతో ఎంఐటీ ఈ నిర్ణయం తీసుకున్నది. దీనిపై సాహితి మాట్లాడుతూ నగరంలోని చెరువుల పరిరక్షణ, పర్యావరణాన్ని కాపాడటానికి తాను చేసిన ప్రయత్నం విజయం సాధించిందని, ఈ విజయానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలని చెప్పారు. ప్రతి విద్యార్థి చెరువుల పరిరక్షణకు కృషి చేయడంతోపాటు వాటిని దత్తతకు తీసుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







