రొమానియాలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి

- June 09, 2017 , by Maagulf
రొమానియాలో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి

రాజమౌళి చెక్కిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి-2 1600 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది.  శతృదేశమైన పాకిస్థాన్‌లోనూ ప్రభంజనం సృష్టించింది.  త్వరలో చైనాలో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  అయితే జూన్ 2నుంచి రొమానియాలో ట్రాన్సిల్ వానియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుండగా, ఇక్కడ బాహుబలి 2 స్పెషల్ స్క్రీనింగ్ ప్రదర్శించారు.  ఇందుకోసం చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ రొమానియాకి వెళ్లారు.  జూన్ 11 వరకు ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com