జీతాల ఆలస్యంపై జిఎఫ్బిటియు ఖండన
- June 09, 2017
ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ, తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడాన్ని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ ఖండించింది. కార్మికులు చాలా కాలంగా సరైన వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారని జిఎఫ్బిటియు జనరల్ సెక్రెటరీ హసన్ అల్హాల్వాచి చెప్పారు. ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సూచనల్ని సైతం ఆ సంస్థ పట్టించుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారాయన. రమదాన్ సందర్భంగా కార్మికుల సమస్యల్లో ఉండకూడదని, సంస్థ వెంటనే కల్పించుకుని సమస్యను పరిష్కరించాలని హసన్ చెప్పారు. మండు వేసవిలోనూ కార్మికులు తమ సమస్యలపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదని హసన్ అన్నారు. కింగ్డమ్లోని పలు కార్మిక సంఘాల్లో జిఎఫ్బిటియు ప్రధానమైనది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









