ఖతార్లో వలసదారులపై ఆందోళన చెందొద్దు
- June 10, 2017
ఖతార్లో వలసదారులెవరూ ఆందోళన చెందడంలేదని, వారి భద్రతపైనగానీ, వారికి సంబంధించిన ఎలాంటి విషయాలపైనగానీ వారి బంధువులు, ఆయా దేశాలు ఆందోళన చెందవద్దని ఖతారీ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మార్కెట్లో నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయనీ, ఖతార్ విషయంలో వివిధ దేశాల్లో జరుగుతున్న దుష్ప్రచారంలో అర్థం లేదని మథావి అనే ఓ మహిళ, ఓ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడుతూ చెప్పారు. మొహమ్మద్ ఇబ్రహమీమ్ కుసాద్ అనే అరబ్ వలసదారుడైన డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గతంలోలానే తాను ఖతార్లో హ్యాపీగా ఉన్నట్లు కుసాద్ వెల్లడించారు. ఖతార్కి వ్యతిరేకంగా మీడియా పనిచేస్తుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఖతార్లో వలసదారులంతా ఇదే ఆలోచనతో ఉన్నారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









