ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియా అంటున్న ఐసిస్
- June 10, 2017
రియాద్: ఇరాన్ పార్లమెంట్ పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్) ఇప్పుడు మరో దేశం మీద దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ ఓ వీడియో విడుదల చేశారని అధికారులు గుర్తించారు.
ఇరాన్ దాడికి ముందే ఆ వీడియో రికార్డు చేశారని సైట్ (ఎస్ఐటీఇ) అధికారులు అంటున్నారు. ఇరాన్, సౌదీ అరేబియాలో తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఓ ఉగ్రవాది హెచ్చరించాడు. మేమే సౌదీ అరేబియాలో అడుగు పెట్టం అన్నాడు.
అయితే మీదేశంలోనే ఉన్న మా సహచరులు దాడులు చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశాడు. ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియానే, మమల్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ ఉగ్రవాది చాలెంజ్ చేశాడు. అంతే కాకుండా ఇరాన్ లో షియా వర్గీయులపై మరన్ని దాడులు చేస్తామని హెచ్చరించాడు.
మేము ఎవ్వరి ఏజెంట్లు కాదు, దేవుడు చెప్పినట్లు నడుచుకుంటాం. మేము ఇస్లాం ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, గల్ఫ్ దేశాలను సైతం వదిలిపెట్టం అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హెచ్చరించాడు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ స్పష్టంగా హెచ్చరికలు చెయ్యడంతో ఆ దేశంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









