ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియా అంటున్న ఐసిస్
- June 10, 2017
రియాద్: ఇరాన్ పార్లమెంట్ పై దాడి చేసింది మేమే అంటూ ప్రకటించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్) ఇప్పుడు మరో దేశం మీద దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ ఓ వీడియో విడుదల చేశారని అధికారులు గుర్తించారు.
ఇరాన్ దాడికి ముందే ఆ వీడియో రికార్డు చేశారని సైట్ (ఎస్ఐటీఇ) అధికారులు అంటున్నారు. ఇరాన్, సౌదీ అరేబియాలో తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఓ ఉగ్రవాది హెచ్చరించాడు. మేమే సౌదీ అరేబియాలో అడుగు పెట్టం అన్నాడు.
అయితే మీదేశంలోనే ఉన్న మా సహచరులు దాడులు చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశాడు. ఇరాన్ తరువాత మా టార్గెట్ సౌదీ అరేబియానే, మమల్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ ఉగ్రవాది చాలెంజ్ చేశాడు. అంతే కాకుండా ఇరాన్ లో షియా వర్గీయులపై మరన్ని దాడులు చేస్తామని హెచ్చరించాడు.
మేము ఎవ్వరి ఏజెంట్లు కాదు, దేవుడు చెప్పినట్లు నడుచుకుంటాం. మేము ఇస్లాం ధర్మం కోసం పోరాటం చేస్తున్నాం, గల్ఫ్ దేశాలను సైతం వదిలిపెట్టం అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది హెచ్చరించాడు. ఇప్పుడు మా టార్గెట్ సౌదీ అరేబియా అంటూ స్పష్టంగా హెచ్చరికలు చెయ్యడంతో ఆ దేశంలో భద్రత కట్టుదిట్టం చేశారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







