తల్లిని వదలక మృతదేహంపైనే కూర్చున్న పసివాడు..!!!
- June 10, 2017
ఆకలిని తట్టుకోలేని పసి వయసు.. తల్లి చనిపోయిందని తెలీని మనసు.. ఉలుకూ పలుకూ లేని అమ్మ కోసం ఓ పసివాడు అల్లాడిపోయాడు.. లేచి పాలిస్తుందని ఎదురుచూసాడు. ఎంతకూ లేవని తల్లి మృతదేహంపైనే కూర్చుని దీనంగా చూసాడు. ఘట్ కేసర్ రైల్వే స్టేషన్లో చనిపోయిన తల్లి పక్కనే ఓ పసివాడి రోదన అందరినీ కన్నీరు పెట్టించింది..
గురువారం రాత్రి 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రెండేళ్ల కొడుకుతో ఘట్ కేసర్ రైల్వేస్టేషన్లో అడుగుపెట్టింది. ఫ్లాట్ఫాంపైకి చేరుకోగానే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కానీ చిన్నారికి తల్లి చనిపోయిందనే విషయం తెలీదు. మృతదేహం పక్కనే కూర్చుని ఏడ్చాడు. అమ్మ లేస్తుంది.. ఎప్పటికైనా తనను ఎత్తుకుంటుందని మృతదేహంపైనే కూర్చున్నాడు.
చాలాసేపటి తర్వాత చిన్నారి ఏడుపులు గమనించి మిగతా ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. మహిళ మృతి చెందిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. పాలు, బిస్కట్లు ఇచ్చి బిడ్డను సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ వాటిని తీసుకుని బిడ్డ ఏడుస్తూనే ఉన్న బాలుడు చివరికి తల్లి పక్కనే తెల్లవారే వరకూ నిద్రపోయాడు. మహిళ మూర్చతో చనిపోయిందని గుర్తించిన రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని తమ సంరక్షణలో ఉంచుకున్నారు.
రెండు వారాల క్రితం మధ్య ప్రదేశ్లో సరిగ్గా ఇలాంటి దృశ్యాలే దేశవ్యాప్తంగా అందరినీ కదిలించాయి. రైలు పట్టాల పక్కన మృతి చెందిన ఓ తల్లి దగ్గర బిడ్డ పాలు తాగేందుకు ప్రయత్నించడం కన్నీరు పెట్టించాయి. దామోహ్లో జరిగిన ఈ ఘటనలో తల్లి రైలు ఢీకొని చనిపోయిదని గుర్తించిన పోలీసులు బిడ్డను సంక్షేమ గృహానికి తరలించారు. ఇప్పుడు అలాంటి ఘటనే హైదరాబాద్లో అందరినీ కలచివేసింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









