తల్లిని వదలక మృతదేహంపైనే కూర్చున్న పసివాడు..!!!

- June 10, 2017 , by Maagulf
తల్లిని వదలక మృతదేహంపైనే కూర్చున్న పసివాడు..!!!

ఆకలిని తట్టుకోలేని పసి వయసు.. తల్లి చనిపోయిందని తెలీని మనసు.. ఉలుకూ పలుకూ లేని అమ్మ కోసం ఓ పసివాడు అల్లాడిపోయాడు.. లేచి పాలిస్తుందని ఎదురుచూసాడు. ఎంతకూ లేవని తల్లి మృతదేహంపైనే కూర్చుని దీనంగా చూసాడు. ఘట్ కేసర్ రైల్వే స్టేషన్లో చనిపోయిన తల్లి పక్కనే ఓ పసివాడి రోదన అందరినీ కన్నీరు పెట్టించింది..

గురువారం రాత్రి 35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రెండేళ్ల కొడుకుతో ఘట్ కేసర్ రైల్వేస్టేషన్‌లో అడుగుపెట్టింది. ఫ్లాట్‌ఫాంపైకి చేరుకోగానే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. కానీ చిన్నారికి తల్లి చనిపోయిందనే విషయం తెలీదు. మృతదేహం పక్కనే కూర్చుని ఏడ్చాడు. అమ్మ లేస్తుంది.. ఎప్పటికైనా తనను ఎత్తుకుంటుందని మృతదేహంపైనే కూర్చున్నాడు. 

చాలాసేపటి తర్వాత చిన్నారి ఏడుపులు గమనించి మిగతా ప్రయాణికులు అక్కడకు చేరుకున్నారు. మహిళ మృతి చెందిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. పాలు, బిస్కట్లు ఇచ్చి బిడ్డను సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ వాటిని తీసుకుని బిడ్డ ఏడుస్తూనే ఉన్న బాలుడు చివరికి తల్లి పక్కనే తెల్లవారే వరకూ నిద్రపోయాడు. మహిళ మూర్చతో చనిపోయిందని గుర్తించిన రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని తమ సంరక్షణలో ఉంచుకున్నారు.

రెండు వారాల క్రితం మధ్య ప్రదేశ్‌లో సరిగ్గా ఇలాంటి దృశ్యాలే దేశవ్యాప్తంగా అందరినీ కదిలించాయి. రైలు పట్టాల పక్కన మృతి చెందిన ఓ తల్లి దగ్గర బిడ్డ పాలు తాగేందుకు ప్రయత్నించడం కన్నీరు పెట్టించాయి. దామోహ్‌లో జరిగిన ఈ ఘటనలో తల్లి రైలు ఢీకొని చనిపోయిదని గుర్తించిన పోలీసులు బిడ్డను సంక్షేమ గృహానికి తరలించారు. ఇప్పుడు అలాంటి ఘటనే హైదరాబాద్‌లో  అందరినీ కలచివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com