ఇక పాన్ మరియు ఐటి రిటర్న్స్ కు ఆధార్ తప్పనిసరి
- June 10, 2017
ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్ తప్పనిసరని స్పష్టంచేసింది ప్రత్యక్షపన్నుల బోర్డు. జులై ఒకటి నుంచి సమర్పించే పన్ను రిటర్న్స్కు కచ్చితంగా ఆధార్ కావాల్సిందేనని పేర్కొంది. వచ్చేనెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. జూలై ఒకటి నాటికి పాన్ పొందినవారు, ఆధార్ ఉన్నవారు, అదేవిధంగా ఆధార్ పొందే అర్హత గలవారు తప్పనిసరిగా ఆధార్ను పన్ను శాఖ అధికారులకు తెలపాలని స్పష్టంచేసింది. పాన్, ఆధార్లను అనుసంధానం చేసేందుకు ఈ వివరాలను సమర్పించాలని వెల్లడించింది.
మరోవైపు పాన్తో ఆధార్ సంఖ్య అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఆధార్ లేనివారికి ప్రస్తుతానికి ఈ నిబంధనను వర్తింప
చేయకూడదని పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆధార్ సంఖ్య ఉన్నవారంతా తప్పనిసరిగా దానిని పాన్తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ కోసం దరఖాస్తు చేసి, నెంబర్ రాని వారు దీనినుంచి మినహాయింపు ఇచ్చింది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









