ఇక పాన్ మరియు ఐటి రిటర్న్స్ కు ఆధార్ తప్పనిసరి
- June 10, 2017
ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్ తప్పనిసరని స్పష్టంచేసింది ప్రత్యక్షపన్నుల బోర్డు. జులై ఒకటి నుంచి సమర్పించే పన్ను రిటర్న్స్కు కచ్చితంగా ఆధార్ కావాల్సిందేనని పేర్కొంది. వచ్చేనెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. జూలై ఒకటి నాటికి పాన్ పొందినవారు, ఆధార్ ఉన్నవారు, అదేవిధంగా ఆధార్ పొందే అర్హత గలవారు తప్పనిసరిగా ఆధార్ను పన్ను శాఖ అధికారులకు తెలపాలని స్పష్టంచేసింది. పాన్, ఆధార్లను అనుసంధానం చేసేందుకు ఈ వివరాలను సమర్పించాలని వెల్లడించింది.
మరోవైపు పాన్తో ఆధార్ సంఖ్య అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఆధార్ లేనివారికి ప్రస్తుతానికి ఈ నిబంధనను వర్తింప
చేయకూడదని పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆధార్ సంఖ్య ఉన్నవారంతా తప్పనిసరిగా దానిని పాన్తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ కోసం దరఖాస్తు చేసి, నెంబర్ రాని వారు దీనినుంచి మినహాయింపు ఇచ్చింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









