ఇక పాన్ మరియు ఐటి రిటర్న్స్ కు ఆధార్ తప్పనిసరి
- June 10, 2017
ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆధార్ తప్పనిసరని స్పష్టంచేసింది ప్రత్యక్షపన్నుల బోర్డు. జులై ఒకటి నుంచి సమర్పించే పన్ను రిటర్న్స్కు కచ్చితంగా ఆధార్ కావాల్సిందేనని పేర్కొంది. వచ్చేనెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. జూలై ఒకటి నాటికి పాన్ పొందినవారు, ఆధార్ ఉన్నవారు, అదేవిధంగా ఆధార్ పొందే అర్హత గలవారు తప్పనిసరిగా ఆధార్ను పన్ను శాఖ అధికారులకు తెలపాలని స్పష్టంచేసింది. పాన్, ఆధార్లను అనుసంధానం చేసేందుకు ఈ వివరాలను సమర్పించాలని వెల్లడించింది.
మరోవైపు పాన్తో ఆధార్ సంఖ్య అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఆధార్ లేనివారికి ప్రస్తుతానికి ఈ నిబంధనను వర్తింప
చేయకూడదని పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆధార్ సంఖ్య ఉన్నవారంతా తప్పనిసరిగా దానిని పాన్తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్ కోసం దరఖాస్తు చేసి, నెంబర్ రాని వారు దీనినుంచి మినహాయింపు ఇచ్చింది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







