ఇక పాన్ మరియు ఐటి రిటర్న్స్ కు ఆధార్ తప్పనిసరి

- June 10, 2017 , by Maagulf
ఇక పాన్ మరియు ఐటి రిటర్న్స్ కు ఆధార్ తప్పనిసరి

ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలు చేయడానికి ఆధార్‌ తప్పనిసరని స్పష్టంచేసింది ప్రత్యక్షపన్నుల బోర్డు. జులై ఒకటి నుంచి సమర్పించే పన్ను రిటర్న్స్‌కు కచ్చితంగా ఆధార్‌ కావాల్సిందేనని పేర్కొంది. వచ్చేనెల 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. జూలై ఒకటి నాటికి పాన్‌ పొందినవారు, ఆధార్ ఉన్నవారు, అదేవిధంగా ఆధార్ పొందే అర్హత గలవారు తప్పనిసరిగా ఆధార్‌ను పన్ను శాఖ అధికారులకు తెలపాలని స్పష్టంచేసింది. పాన్, ఆధార్‌లను అనుసంధానం చేసేందుకు ఈ వివరాలను సమర్పించాలని వెల్లడించింది.

మరోవైపు పాన్‌తో ఆధార్‌ సంఖ్య అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఆధార్‌ లేనివారికి ప్రస్తుతానికి ఈ నిబంధనను వర్తింప 
చేయకూడదని పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆధార్‌ సంఖ్య ఉన్నవారంతా తప్పనిసరిగా దానిని పాన్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఆధార్‌ కోసం దరఖాస్తు చేసి, నెంబర్‌ రాని వారు దీనినుంచి మినహాయింపు ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com