స్లొవేనియాలో ఈజీ జెట్ ఫ్లైట్కు ఉగ్రభయం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్... ముగ్గురి అరెస్టు
- June 10, 2017
ఈజీ జెట్ ఫ్లైట్లో ఉగ్రవాదులు ఉన్నట్టు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేశారు. ఆదివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... స్లొవేనియా రాజధాని లుబ్లిజానా నుంచి లండన్ కు 151 మంది ప్రయాణికులతో ఈజీ జెట్ ఫ్లైట్ ఒకటి బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా ఉగ్రకార్యకలాపాలకు సంబంధించి చర్చలు జరుపుకుంటున్నారని కొంతమంది ప్రయాణికులు విమానం సిబ్బంది చెవిలో ఊదారు. ఈ సమాచారాన్ని పైలట్లకు చేరవేయగా, వారు ఏటీసీకి చేరవేశారు. దీంతో విమానాన్ని జనసంచారం అంతగా ఉండని కొలోంగ్లోని బాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి, ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు పంపారు. ఆపై ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి బ్యాక్ప్యాక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాక్ప్యాక్లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అన్న విషయం తెలియరాలేదు. వీరు ఎవరు? విమానంలో ఏం మాట్లాడుకున్నారన్న విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనతో యూరప్లో గత రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య 10 విమానాలను దారి మళ్లించగా, 20 విమానాల ప్రయాణం ఆలస్యమైంది.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









