స్లొవేనియాలో ఈజీ జెట్ ఫ్లైట్కు ఉగ్రభయం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్... ముగ్గురి అరెస్టు
- June 10, 2017
ఈజీ జెట్ ఫ్లైట్లో ఉగ్రవాదులు ఉన్నట్టు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేశారు. ఆదివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... స్లొవేనియా రాజధాని లుబ్లిజానా నుంచి లండన్ కు 151 మంది ప్రయాణికులతో ఈజీ జెట్ ఫ్లైట్ ఒకటి బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా ఉగ్రకార్యకలాపాలకు సంబంధించి చర్చలు జరుపుకుంటున్నారని కొంతమంది ప్రయాణికులు విమానం సిబ్బంది చెవిలో ఊదారు. ఈ సమాచారాన్ని పైలట్లకు చేరవేయగా, వారు ఏటీసీకి చేరవేశారు. దీంతో విమానాన్ని జనసంచారం అంతగా ఉండని కొలోంగ్లోని బాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి, ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు పంపారు. ఆపై ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి బ్యాక్ప్యాక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాక్ప్యాక్లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అన్న విషయం తెలియరాలేదు. వీరు ఎవరు? విమానంలో ఏం మాట్లాడుకున్నారన్న విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనతో యూరప్లో గత రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య 10 విమానాలను దారి మళ్లించగా, 20 విమానాల ప్రయాణం ఆలస్యమైంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







