బ్రిటన్ ఎంపీల్లో 650 స్థానాలుకు 208 మంది మహిళలే
- June 10, 2017
బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్ దిగువసభలో 208 స్థానాల్లో మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లోనూ 191 మంది మహిళలే గెలుపొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 208 స్థానాల్లో మహిళలు గెలుపొందడం ద్వారా ఆ రికార్డును అధిగమించినట్లయింది. ఈ 208 మందిలో ఎక్కువగా కన్సర్వేటివ్, లేబర్ పార్టీల నుంచి మహిళలు ఉన్నారు. ప్రధాని థెరెసా మే నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 318 స్థానాలను కైవసం చేసుకుంది. జెరెమీ కోర్బిన్ నేతృత్వంలోని విపక్ష లేబర్ పార్టీకి 261 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 29 స్థానాలు పెరగ్గా.. కన్సర్వేటివ్ పార్టీకి 13 సీట్లు తగ్గాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించకపోవడంతో థెరెసా.. ఉత్తర ఐర్లాండ్లోని డెమోక్రటిక్ యూనియనిస్టు పార్టీకి చెందిన 10మంది ఎంపీల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలున్నాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







