బ్రిటన్ ఎంపీల్లో 650 స్థానాలుకు 208 మంది మహిళలే
- June 10, 2017
బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళలు సత్తా చాటారు. మొత్తం 650 స్థానాలున్న బ్రిటన్ దిగువసభలో 208 స్థానాల్లో మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2015లో జరిగిన ఎన్నికల్లోనూ 191 మంది మహిళలే గెలుపొందడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 208 స్థానాల్లో మహిళలు గెలుపొందడం ద్వారా ఆ రికార్డును అధిగమించినట్లయింది. ఈ 208 మందిలో ఎక్కువగా కన్సర్వేటివ్, లేబర్ పార్టీల నుంచి మహిళలు ఉన్నారు. ప్రధాని థెరెసా మే నాయకత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ 318 స్థానాలను కైవసం చేసుకుంది. జెరెమీ కోర్బిన్ నేతృత్వంలోని విపక్ష లేబర్ పార్టీకి 261 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీకి 29 స్థానాలు పెరగ్గా.. కన్సర్వేటివ్ పార్టీకి 13 సీట్లు తగ్గాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించకపోవడంతో థెరెసా.. ఉత్తర ఐర్లాండ్లోని డెమోక్రటిక్ యూనియనిస్టు పార్టీకి చెందిన 10మంది ఎంపీల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే సూచనలున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









