పారామెడిక్స్ టీమ్ని సత్కరించిన సివిల్ డిఫెన్స్
- June 11, 2017
దుబాయ్ సివిల్ డిఫెన్స్, పారామెడిక్ టీమ్ని సత్కరించింది. అగ్ని ప్రమాదం కారణంగా కాలిపోతున్న ఓ భవనం నుంచి ముగ్గురు వ్యక్తుల్ని రక్షించే క్రమంలో వీరు ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది. అల్ మనార్ ప్రాంతంలో గత నెలలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటలో దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ (డిఎసిఎస్)కి చెందిన పారామెడిక్స్ టీమ్, ఓ చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గుర్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రషీద్ థని అల్ మత్రోషి ఈ సందర్భంగా పారామెడిక్స్ టీమ్ని ప్రశంసలతో ముంచెత్తారు. డ్రైవర్ జలాల్ అబాదీ, అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి దూసుకెళ్ళి చిన్నారని తీసుకొచ్చారు. పారామెడిక్ నాజర్ అల్ మజ్రోకి, ఓ వృద్ధురాల్ని బయటకు తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







