పారామెడిక్స్ టీమ్ని సత్కరించిన సివిల్ డిఫెన్స్
- June 11, 2017
దుబాయ్ సివిల్ డిఫెన్స్, పారామెడిక్ టీమ్ని సత్కరించింది. అగ్ని ప్రమాదం కారణంగా కాలిపోతున్న ఓ భవనం నుంచి ముగ్గురు వ్యక్తుల్ని రక్షించే క్రమంలో వీరు ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది. అల్ మనార్ ప్రాంతంలో గత నెలలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటలో దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్ (డిఎసిఎస్)కి చెందిన పారామెడిక్స్ టీమ్, ఓ చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గుర్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ రషీద్ థని అల్ మత్రోషి ఈ సందర్భంగా పారామెడిక్స్ టీమ్ని ప్రశంసలతో ముంచెత్తారు. డ్రైవర్ జలాల్ అబాదీ, అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి దూసుకెళ్ళి చిన్నారని తీసుకొచ్చారు. పారామెడిక్ నాజర్ అల్ మజ్రోకి, ఓ వృద్ధురాల్ని బయటకు తీసుకొచ్చారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









