ఖతార్ సమస్యపై భారత్కు గల్ఫ్ దేశాల హామీ
- June 11, 2017
గల్ఫ్ దేశాల్లో తలెత్తిన ఖతార్ సమస్యకు సంబంధించి ఆయా దేశాలు చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని భారతదేశం చేసిన సూచన పట్ల ఆయా దేశాలు సానుకూలంగా స్పందించాయి. తమ దేశాల్లో ఉంటోన్న భారతీయులకు ఈ సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయా దేశాలు పేర్కొన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిథులు పేర్కొన్నాయి. ఖతార్లో 6,30,000 మందికి పైగా భారతీయ కార్మికులున్నారు. ఖతార్ చిన్న దేశమైనా, అక్కడ భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఆయా దేశాల్లోని ఎంబసీని సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంకో వైపున ఖతార్లోని దోహా నుంచి భారతీయ వలసదారులకు ఓ సూచన వచ్చింది. రూమర్స్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరాదనీ, పరిస్థితులు ఖతార్లో ఏమంత ఆందోళనకరంగా లేవని ఖతార్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







