ఖతార్ సమస్యపై భారత్కు గల్ఫ్ దేశాల హామీ
- June 11, 2017
గల్ఫ్ దేశాల్లో తలెత్తిన ఖతార్ సమస్యకు సంబంధించి ఆయా దేశాలు చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని భారతదేశం చేసిన సూచన పట్ల ఆయా దేశాలు సానుకూలంగా స్పందించాయి. తమ దేశాల్లో ఉంటోన్న భారతీయులకు ఈ సమస్య కారణంగా ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఆయా దేశాలు పేర్కొన్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిథులు పేర్కొన్నాయి. ఖతార్లో 6,30,000 మందికి పైగా భారతీయ కార్మికులున్నారు. ఖతార్ చిన్న దేశమైనా, అక్కడ భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా, ఆయా దేశాల్లోని ఎంబసీని సంప్రదించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంకో వైపున ఖతార్లోని దోహా నుంచి భారతీయ వలసదారులకు ఓ సూచన వచ్చింది. రూమర్స్ని ఎట్టి పరిస్థితుల్లో విశ్వసించరాదనీ, పరిస్థితులు ఖతార్లో ఏమంత ఆందోళనకరంగా లేవని ఖతార్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం









