షార్జాలో 7 వ అంతస్తు నుంచి కింద పడి మహిళ మృతి
- June 11, 2017
షార్జా : స్థానిక అల్ మరీజా ప్రాంతంలోని ఒక భవనం ఏడవ అంతస్తు పై నుంచి 41 ఏళ్ల ఇండోనేషియా మహిళ పడిపోయి మరణించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ మరణం గూర్చి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు తెలియచేస్తూ, శనివారం రాత్రి తమ కార్య నిర్వహణ గదికి ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. వెంటనే తాము, అంబులెన్స్ సిబ్బంది నేర ప్రదేశానికి తరలివెళ్లినట్లు తెలిపారు. అక్కడ వారు రక్తం మడుగులో దారుణంగా చనిపోయిన స్త్రీని కనుగొన్నారు. ఈ మరణం యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు మహిళ యొక్క శరీరం శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించబడింది. ఆ మహిళ చనిపోయే ముందు చివరిసారిగా కల్సిన వ్యక్తులు ..ఆమెకు పరిచయం సంబంధాలు ఉన్నట్లు విశ్వసించిన వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొన్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అల్ ఘర్బ్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు., దర్యాప్తు పూర్తి కాక ముందే ఈ కేసు ఆత్మహత్య అని పరిగణించలేమని ఆ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









