షార్జాలో 7 వ అంతస్తు నుంచి కింద పడి మహిళ మృతి
- June 11, 2017
షార్జా : స్థానిక అల్ మరీజా ప్రాంతంలోని ఒక భవనం ఏడవ అంతస్తు పై నుంచి 41 ఏళ్ల ఇండోనేషియా మహిళ పడిపోయి మరణించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ మరణం గూర్చి సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు తెలియచేస్తూ, శనివారం రాత్రి తమ కార్య నిర్వహణ గదికి ఫోన్ వచ్చిందని పోలీసులు చెప్పారు. వెంటనే తాము, అంబులెన్స్ సిబ్బంది నేర ప్రదేశానికి తరలివెళ్లినట్లు తెలిపారు. అక్కడ వారు రక్తం మడుగులో దారుణంగా చనిపోయిన స్త్రీని కనుగొన్నారు. ఈ మరణం యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు మహిళ యొక్క శరీరం శవపరీక్ష కోసం ఫోరెన్సిక్ ప్రయోగశాలకు తరలించబడింది. ఆ మహిళ చనిపోయే ముందు చివరిసారిగా కల్సిన వ్యక్తులు ..ఆమెకు పరిచయం సంబంధాలు ఉన్నట్లు విశ్వసించిన వారిని పోలీసులు అదుపులోనికి తీసుకొన్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అల్ ఘర్బ్ పోలీసు స్టేషన్ అధికారి తెలిపారు., దర్యాప్తు పూర్తి కాక ముందే ఈ కేసు ఆత్మహత్య అని పరిగణించలేమని ఆ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







