ఖతార్ కు ఆహారం పంపిణీ చేస్తున్న ఇరాన్
- June 11, 2017
టెహ్రాన్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఖతార్తో గల్ఫ్దేశాలు సంబంధాలు తెంచుకోవడం వల్ల అక్కడ తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. గల్ఫ్దేశాల నుంచి ఖతార్ ఎక్కువగా ఆహారపదార్థాలను దిగుమతి చేసుకునేది. కానీ ఆయా దేశాలు ఖతార్తో రవాణా సంబంధాలు తెంచుకోవడం వల్ల ఆహారం కొరత ఏర్పడింది. దీనిపై ఇరాన్ స్పందించి ఆహారాన్ని సరఫరా చేసింది. ఐదు విమానాల్లో ఖతార్కు ఆహార పదార్థాలు పంపించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ‘పండ్లు, కూరగాయలతో పాటు తినే ఆహారపదార్థాలను ఐదు విమానాల్లో పంపించాం. ఒక్కో విమానంలో దాదాపు 90టన్నుల ఆహారపదార్థాలను పంపించినట్లు’ ఇరాన్ వైమానిక దళ ప్రతినిధి షహ్రోక్ నౌషాబది తెలిపారు.
ఖతార్కు ఇంకా అవసరమైతే పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. విమానాలతో పాటు మూడు పెద్ద ఓడల్లో 350 టన్నుల ఆహారాన్ని ఇరానియన్ పోర్టు ఉంచి ఖతార్కు పంపించారు. ఉగ్రవాదానికి నిధులు ఇస్తూ ప్రోత్సహిస్తుందని ఖతార్తో సౌదీ అరేబియా, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్టు, యెమెన్ దౌత్య సంబంధాలను తెంచుకున్నాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







