అమెరికాలో మృతిచెందిన రత్నాకర్ కుటుంబానికి నాట్స్ ఆర్ధిక సాయం

- June 11, 2017 , by Maagulf
అమెరికాలో మృతిచెందిన రత్నాకర్ కుటుంబానికి నాట్స్ ఆర్ధిక సాయం

అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన రత్నాకర్ షెట్టి పల్లి కుటుంబ సభ్యులకు నార్త్ అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ అండగా నిలిచింది. దీనిలో భాగంగా డల్లాస్ లోని ఇర్వింగ్ లో కార్యక్రమాన్ని నిర్వహించి ఫండ్ రైజింగ్ చేపట్టింది. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్ర హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటీవ్ రట్ రినాల్టీ హాజరై నాట్స్ చేస్తున్న సహాయ కార్యక్రమాన్ని అభినందించారు. రత్నాకర్ కుటుంబ సభ్యులకు 13వేల డాలర్లు అందించినట్లు నాట్స్ ప్రతినిధులుతెలిపారు. అమెరికాలో ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకునేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని నాట్స్ ప్రతినిధులు డాక్టర్ చౌదరీ అచంట, బాపు నూతి, రాజేంద్రమండల వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com